Rashmika Mandanna: నెట్‌వర్క్‌లేని ప్రాంతంలో ఏం జరిగిందంటే!

ABN , First Publish Date - 2023-05-02T13:14:35+05:30 IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా (Rashmika mandanna) అభిమానులకు, సోషల్‌ మీడియా ఫాలోయర్లను క్షమించమని కోరారు.

Rashmika Mandanna:  నెట్‌వర్క్‌లేని ప్రాంతంలో ఏం జరిగిందంటే!

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా (Rashmika mandanna) అభిమానులకు, సోషల్‌ మీడియా ఫాలోయర్లను క్షమించమని కోరారు. ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉండే ఆమె వారం రోజులుగా ఎవరికీ అందుబాటులో లేదు. దాంతో అభిమానులు ఆమెను ట్యాగ్‌ (National crush) చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. తాజాగా రష్మిక స్పందించారు. వారం రోజులు అందుబాటులో లేకపోవడానికి కారణం చెబుతూ ‘ఐ మిస్‌ యు ఆల్‌’ అంటూ పోస్ట్‌ చేశారు. ‘రెయిన్‌ బో’(Rainbow) సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేశారు. ‘‘నెట్‌వర్క్‌లేని ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతోంది. అందుకే ఆన్‌లైన్‌లోకి రాలేకపోయా. అప్‌డేట్స్‌ ఇవ్వలేకపోయా. అందరూ క్షమించండి. మీ అందర్ని ఎంతో మిస్సయ్యాను. ప్రస్తుతం ‘రెయిన్‌ బో’ చిత్రీకరణలో బిజీగా ఉన్నా’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు లొకేషన్‌లో తీసుకున్న మధురమైన ఫొటోలను షేర్‌ చేశారు. ఒక్కో ఫొటోకు ఒక్కో వివరణ ఇచ్చారు. Rashmika sorry to Fans)

తొలుత చెన్నైలో షూటింగ్‌ జరిగిందని.. ఆ తర్వాత మున్నార్‌, కొడైకెనాల్‌ (Rainbow shooting) ప్రాంతాల్లో షూటింగ్‌ చేసినట్లు తెలిపారు. ప్యాకప్‌ డే అంటూ దేవ్‌ మోహన్‌తో సెల్ఫీ తీసుకున్నారు. షెడ్యూల్‌ పూర్తయింది అంటూ టీమ్‌ అందరితో దిగిన ఫొటోపు పంచుకున్నారు. షూటింగ్‌ స్పాట్‌కి వచ్చిన తన తల్లి, చెల్లి ఫొటోలను షేర్‌ చేశారు. తను బస చేసిన రూమ్‌ నుంచి లొకేషన్‌ని కెమెరాలో బంధించి ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ షూటింగ్‌ను చాలా ఎంజాయ్‌ చేశానని, ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకు ఉల్లాసాన్నిచ్చిందని పేర్కొంది. విమెన్‌ ఓరియెంటెడ్‌ సినిమా ఇది. గత నెలలో చిత్రీకరణ మొదలైంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో రష్మికతోపాటు దేవ్‌మోహన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. శాంతరూబన్‌ దర్శకుడు. దీనితోపాటు హిందీలో ‘యానిమల్‌’ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో అర్జున్‌ అర్జున్‌ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప-2’ (Pushpa2) చిత్రంలో శ్రీవల్లిగా సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.

Updated Date - 2023-05-02T13:34:19+05:30 IST