Guntur Karam: థమన్ అరటిపండు పెట్టేసాడుగా, అంటే దానర్థం అదేగా...

ABN , First Publish Date - 2023-06-20T11:58:33+05:30 IST

సంగీత దర్శకుడు థమన్ తన ట్విట్టర్ లో సగం వొలిచిన అరటి పండు పెట్టాడు. దీని భావమేమి తిరుమలేశ అన్నట్టుగా ఆ ఒక్క ఫోటోతో ఏమి చెప్పాలనుకున్నాడో అది చెప్పేసాడు

Guntur Karam: థమన్ అరటిపండు పెట్టేసాడుగా, అంటే దానర్థం అదేగా...
Naga Vamsi, Trivikram, Mahesh Babu and music director Thaman

ఇంతకు ముందే కథానాయకురాలు పూజ హెగ్డే (PoojaHegde), 'గుంటూరు కారం' #GunturKaram నుండి తప్పుకుంటున్నటుగా వార్తలు వైరల్ అయ్యాయి అనుకున్నాం కదా, ఇప్పుడు ఆ సినిమాకి పని చేస్తున్న సంగీత దర్శకుడు కూడా తప్పుకుంటున్నాడు. సంగీత దర్శకుడు థమన్ (SSThaman) తన ట్విట్టర్ లో సగం వొలిచిన అరటు పండు పెట్టేసాడు, అంటే దానర్ధం అదే కదా! తాను 'గుంటూరు కారం' #GunturKaram నుండు తప్పుకుంటున్నట్టే కదా అని నెటిజన్స్ అందరూ అంటున్నారు. మహేష్ బాబు (MaheshBabu) కథానాయకుడిగా, త్రివిక్రమ్ (TrivikramSrinivas) దర్శకుడిగా 'గుంటూరు కారం' సినిమా గత సంవత్సరం షూటింగ్ మొదలయింది.

ssthaman.jpg

సితార ఎంటర్ టైన్మెంట్ (SitharaEntertainments) సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమాకి మొదటి నుండీ ఎందుకో బ్రేక్స్ పడుతూనే వున్నాయి. ఒక సంవత్సరం అయినా కూడా ఈ సినిమా కేవలం 10 శాతం షూటింగ్ కూడా అవలేదు అని పరిశ్రమలో అంటున్నారు. ఎందుకు పోస్టుపోన్ అవుతోందో ఎవరికీ అర్థం కావటం లేదు. ఒక పక్క మహేష్ బాబు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ (#AusVsEngAshes) మధ్య జరిగే టెస్ట్ #Ashes క్రికెట్ మ్యాచ్ చూసుకుంటున్నాడు, దాని గురించి ట్వీట్ కూడా చేసాడు, ఇంకో పక్క దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆహా ఛానల్ కోసం అల్లు అర్జున్, శ్రీలీల మీద స్కిట్ చేసుకుంటున్నాడు.

మరి ఈ 'గుంటూరు కారం' గురించి మాత్రం ఇద్దరూ పట్టించుకోవటం లేదు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఇప్పుడు థమన్ ఈ సినిమా నుండి తప్పుకుంటున్నాడు అంటే, ఇంక ఈ సినిమా గురించి ఏదైనా సమాచారం అధికారికంగా నిర్మాత ఏమైనా మాట్లాడితే తెలుస్తుంది.

Updated Date - 2023-06-20T11:58:33+05:30 IST