Anausya: మళ్ళీ వైరల్ అయిన అనసూయ, ఈసారి ఎందుకంటే...

ABN , First Publish Date - 2023-06-09T17:03:24+05:30 IST

అప్పుడెప్పుడో 2017 లో విడుదల 'అర్జున్ రెడ్డి' మంచి విజయం సాధించింది, వేరే భాషల్లో కూడా రీమేక్ చేశారు, కొన్ని హిట్ అయ్యాయి కూడా, అదంతా గతం. కానీ ఆ సినిమా విడుదల అయిన దగ్గర నుండి నేటి వరకు అంటే సుమారు ఆరు సంవత్సరాలు అవుతున్నా ప్రముఖ యాంకర్ నటి అనసూయ ఆ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ మీద ఇంకా ఏవో ఆరోపణలు చేస్తూనే వుంది. విజయ్ అభిమానులు ఆమె అన్న ప్రతీ సారి ఆమెని ట్రోల్ చేస్తూనే వున్నారు.

Anausya: మళ్ళీ వైరల్ అయిన అనసూయ, ఈసారి ఎందుకంటే...
Anasuya Bharadwaj

అనసూయ భరద్వాజ్ (AnasuyaBharadwaj), ఈ పేరు ఎప్పుడూ వార్తల్లో వినపడుతూనే ఉంటుంది. సాంఘీక మాధ్యమాల్లో ఎదో పోస్ట్ పెట్టడం, లేకపోతే ఎవరి మీదయినా ఏదైనా మాట్లాడటం, ఆమెని ఎవరో అనటం ఇలాంటివి ఆమెని ఎప్పుడూ వార్తల్లో ఉంచుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఆమె మళ్ళీ విజయ దేవరకొండ (VijayDeverakonda) మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ టీము లో కొందరు డబ్బులిచ్చి కావాలనే అనసూయ #Anasuya మీద ట్రోల్స్ చేయించారు అన్నది అనసూయ ఒక తమిళ రిపోర్టర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది. అందుకని మళ్ళీ ఆమె పేరు వైరల్ అవుతోంది.

vijayd2.jpg

అనసూయ నటించిన 'విమానం' #Vimanam సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయింది. ఈ సినిమా ప్రచార చిత్రాల్లో భాగంగా ఆమె పలు మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చింది, అందులో విజయ దేవరకొండ టాపిక్ కూడా వుంది. 'అర్జున్ రెడ్డి' #ArjunReddy అనే సినిమా ప్రచారం లో భాగంగా విజయ్ చేసిన కొన్ని కామెంట్స్ ని అనసూయ వ్యక్తిగతంగా తీసుకుంది అని, ఆ సినిమా ప్రచారంలో భాగం అది, అప్పుడే అయిపొయింది, కానీ ఆమె ఇంకా మరిచిపోలేదని పరిశ్రమలో అంటున్నారు. అనసూయ గతాన్ని అనవసరంగా ఇంకా తవ్వుకుంటోంది అని పరిశ్రమలో వాళ్ళు అంటున్నారు.

anasuya4.jpg

2019 సంవత్సరంలో విజయ్ నిర్మించిన సినిమాలో 'మీకు మాత్రమే చెప్తా' (MeekuMaatrameChepta) సినిమాలో అనసూయ నటించింది. అప్పుడు విజయ్ టీములో వుండే సభ్యులే ఆమెకి చెప్పారట ఏమని అంటే, విజయ్ టీము సభ్యులు కొంతమందికి డబ్బులిచ్చి అనసూయని ట్రోల్ చెయ్యండి అని. ఇంతకీ ఆమె చెప్పేది ఏంటంటే అర్జున్ రెడ్డి సినిమా విడుదలయినప్పుడు విజయ్ దేవరకొండ కొంతమంది ప్రేక్షకులని రెచ్చగొట్టి కొన్ని అనకూడని పదాలు వాళ్ళతో అనిపించాడని, దానికి అనసూయ విజయ్ కి ఫోన్ చేసి ఆలా ఎంకరేజ్ చేయొద్దని చెప్పిందట. ఆ సినిమా విడుదల తరువాత ఆడవాళ్ళమీద అత్యాచారాలు కూడా పెరిగాయని అనసూయ ఆ ఇంటర్వ్యూ లో చెప్పింది.

అయితే అర్జున్ రెడ్డి #ArjunReddy సినిమా విడుదల అయ్యే సమయానికి విజయ్ దేవరకొండకి అసలు టీము అంటూ ఎక్కడుంది, ఏమీ లేదు. అతను అప్పటికి ఇంకా స్టార్ కాలేదు, టీము ఏర్పాటు కూడా చేసుకోలేదు అని అతని సన్నిహితులు చెపుతున్నారు. ఆ తరువాత విడుదల అయిన 'గీత గోవిందం' #GeethaGovindam సినిమా తరువాత అతను ఒక టీమును ఏర్పాటు చేసుకున్నాడు అని అన్నారు.

anasuya3.jpg

మరి అనసూయ విజయ్ టీము సభ్యులు చేయించారు అంటే, అప్పటికి విజయ్ కి టీము అంటూ లేనప్పుడు ఎక్కడ చేయిస్తాడు అని విజయ్ సన్నిహితులు అంటున్నారు. అనసూయ చేసిన ఆరోపణలపై ఇప్పుడున్న విజయ్ టీముని అడిగితే "మేము ఏమి చెప్పదలుచుకోలేదు, మేము అప్పుడు లేము. ఇప్పుడు ఆమె ఏమి మాట్లాడుతోందో మాకు తెలీదు," అని బదులిచ్చారు. పరిశ్రమలో ఎంతమంది నటీనటుల్ని రోజూ ట్రోల్ చెయ్యడం చూడటం లేదు, అలాగే సాంఘీక మాధ్యమాలకు ఒక హద్దు ఉందా? దాని మీద ఎవరికైనా కంట్రోల్ వుందా? ఏమీ లేదు. ప్రతీ నటీనటులు సినిమా విజయం, ఫ్లాపులతో సంబంధం లేకుండా ముందుకు వెళుతున్నారు అంతేకానీ ఫ్లాప్ అయింది, లేదా ఎవరో ఎదో అన్నారు అని అక్కడే ఉండిపోవటం లేదు కదా, అలాగే అనసూయ, విజయ్ లు కూడా ఆ వివాదాన్ని వదిలి మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ఒక నిర్మాత పేరు చెప్పకుండా ఈ విషయం మీద కామెంట్ చేసాడు.

మరి అనసూయ ఇన్స్టాగ్రామ్ లో పెట్టె ఫోటోలు, వీడియోల సంగతి ఏంటి అని ఒక దర్శకుడు అన్నాడు. అవి పిల్లలు చూడతగ్గవేనా, సినిమాలు చూసి పిల్లలు చెడిపోతే, ఆమె కూడా అలాంటి వీడియోస్, ఫోటోస్ పెడితే తప్పులేదా, అవి చూసి చెడిపోరా అని ఆ దర్శకుడు అన్నాడు. అలాగే ఒక ఛానల్ లో వచ్చిన కామెడీ షో లో ఆడవాళ్ళని కించపరిచే డైలాగ్స్, స్కిట్స్ చాలా ఎక్కువ అని, అలంటి షోకి అనసూయ యాంకరింగ్ చేసి ఆ డైలాగ్స్ చెప్పినప్పుడు నవ్వుతూ చప్పట్లు కొట్టేది కదా అని ఇంకొక నిర్మాత అన్నాడు. ఏమైనా ఈ ఇద్దరూ వాళ్ళిద్దరి మధ్య ఈ వివాదం ఆపేస్తే ఇద్దరికీ ప్రశాంతంగా ఉంటుందని ఆ నిర్మాత చెప్పాడు.

Updated Date - 2023-06-09T17:03:24+05:30 IST