Allu Arjun: ఇప్పుడు చిరంజీవిని కలవనున్న ఉత్తమ నటుడు అల్లు అర్జున్

ABN , First Publish Date - 2023-08-26T11:24:19+05:30 IST

ఉత్తమ నటుడిగా 'పుష్ప' లో తను చేసిన పుష్పరాజ్ పాత్రకి గాను జాతీయ సినిమా పురస్కారం అందుకోబోతున్న అల్లు అర్జున్ ఇప్పుడు స్వయంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి, ఆరోగ్యం గురించి వాకబు చేసి తరువాత తన జాతీయ పురస్కారం విషయం గురించి మాట్లాడనున్నాడు అని తెలిసింది.

Allu Arjun: ఇప్పుడు చిరంజీవిని కలవనున్న ఉత్తమ నటుడు అల్లు అర్జున్
File picture of Mega Star Chiranjeevi and Allu Arjun

జాతీయ సినిమా అవార్డు #NationalFilmAward పురస్కారాల్లో ఉత్తమ నటుడు #BestActor అవార్డు గెలుగుచుకున్న అల్లు అర్జున్ (AlluArjun) తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి నటుడిగా ఈ అవార్డు తీసుకుంటూ చరిత్ర సృష్టించాడు. ప్రపంచం నలుమూలలనుండి అతనికి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. 'పుష్ప' #Pushpa సినిమాలో అతని నటనకి గాను ఈ అవార్డు అతనికి దక్కింది. సుకుమార్ (Sukumar) దీనికి దర్శకుడు, మైత్రి మూవీ మేకర్స్ (MythriMovieMakers) ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా విడుదలైనప్పుడు ప్రపంచం అంతా ఒక ప్రభంజనంలా మారుమోగింది. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ప్రతివారూ 'తగ్గేదే లే' #ThaggedeLe అనే పదాన్ని, అల్లు అర్జున్ ఆ సినిమాలో చేసిన ఆ మేనరిజంని చేసి చూపించారు. #NationalAward

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ల్లో కూడా వికెట్ తీసేటప్పుడు బౌలర్ ఈ అల్లు అర్జున్ మేనరిజంని చేసి సంబరాలు చేసుకునేవాడు. అంతలా ఆ పాత్ర ప్రభావం వుంది అంటే అందులో అల్లు అర్జున్ ప్రతిభ ఉందనే చెప్పాలి. అల్లు అర్జున్ ఇంటికి ఇక అందరూ పుష్పగుచ్చాలతో వస్తూనే వున్నారు, అలాగే అల్లు అర్జున్ కూడా కొంతమంది పెద్దల ఇంటికి వెళ్లి తానే పలకరిస్తున్నాడు. అది అతని వ్యక్తిత్వాన్ని చెపుతుంది. సీనియర్ నటుడు బ్రహ్మానందం (Brahmanandam) కుమారుడి వివాహానికి అల్లు అర్జున్ హాజరు కాలేకపోయాడు, అందుకని ఇప్పుడు అవార్డు వచ్చిన తరువాత బ్రహ్మానందం ఇంటికి తనే వెళ్లి పలకరించి అతనితో సుమారు గంటన్నర సమయం గడిపాడు అల్లు అర్జున్.

alluarjun-brahmi1.jpg

బ్రహ్మానందం అల్లు అర్జున్ కి దండవేసి అవార్డు గెలుచుకున్నందుకు అభినందించారు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ మెగా స్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi) ఇంటికి వెళుతున్నాడు. చిరంజీవి కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని ఈరోజు ఉదయం హైద్రాబాదులోని తన ఇంటికి చేరుకున్నారు. బాగా కోలుకున్నారు అని కూడా తెలిసింది. ఇప్పుడు అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్లి ముందు అతని ఆరోగ్య విషయం తెలుసుకొని, తరువాత అవార్డు గురించి మాట్లాడతాడు అని తెలిసింది. మెగా కుటుంబంలో చిరంజీవి తరువాత ఎవరైనా, అందుకని అల్లు అర్జున్ ఈరోజు చిరంజీవి హైదరాబాదు చేరుకున్నారని తెలిసిన వెంటనే తనే ముందుగా వెళ్లి పలకరించాలని వెళుతున్నాడని తెలిసింది.

Updated Date - 2023-08-26T11:24:19+05:30 IST