The Vaccine War: షూటింగ్లో ప్రమాదం.. నటికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2023-01-16T20:44:16+05:30 IST
‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి (Vivek Ranjan Agnihotri).. ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా చిత్రం
![The Vaccine War: షూటింగ్లో ప్రమాదం.. నటికి తీవ్ర గాయాలు](https://media.chitrajyothy.com/media/2022/20221214/Pallavi_c02bd86d06.jpg)
‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి (Vivek Ranjan Agnihotri).. ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘ది వాక్సిన్ వార్’ (The Vaccine War). ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్ (I Am Buddha Productions) పతాకంపై పల్లవి జోషి (Pallavi Joshi) ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి చివరి షెడ్యూల్ షూటింగ్లో హైదరాబాద్లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్లో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా నటి పల్లవి జోషి గాయపడ్డారు. ఓ వాహనం అదుపు తప్పి ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో దగ్గరలోని హాస్పిటల్లో ఆమెకు చికిత్స అందించినట్లుగా తెలుస్తుంది.
ఈ ఘటనపై చిత్రయూనిట్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే వుందని, అభిమానులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అనుపమ్ ఖేర్, నానా పటేకర్, దివ్య సేథ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) తన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
2023 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీలతో సహా 10 భాషలకు పైగా విడుదల కానుంది.