NTR30: రాజమౌళికి జాన్వి కపూర్ ఏమి రాసిచ్చిందో తెలుసా...

ABN , First Publish Date - 2023-03-23T11:43:16+05:30 IST

కూతురి కోరిక తీర్చటం కోసం రాజమౌళి ఎన్టీఆర్ సినిమాలో కథానాయికగా చేస్తున్న జాన్వీ కపూర్ ని ఏమి అడిగాడో తెలుస్తే మీరు షాక్ అవుతారు

NTR30: రాజమౌళికి జాన్వి కపూర్ ఏమి రాసిచ్చిందో  తెలుసా...

ఈరోజు గురువారం ఎన్టీఆర్ 30 (NTR30) వ సినిమా అధికారికంగా ప్రారంభం అయింది. దర్శకుడు కొరటాల శివ (Koratala Siva), నిర్మాత ఎన్టీఆర్ (NTR) అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). ఈ ప్రారంభోత్సవానికి చాలామంది చిత్ర పరిశ్రమ నుండి హాజరయ్యారు. అలాగే ఈ ముహూర్తానికి ప్రముఖ దర్శకులు రాజమౌళి (Rajamouli), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) వచ్చి లాంచ్ చేశారు. అలాగే ఇందులో కథానాయికగా నటిస్తున్న జాన్వి కపూర్ (Janhvi Kapoor) కూడాఆ హాజరయ్యింది. మొదటి సన్నివేశం ఎన్టీఆర్, జాన్వి కపూర్ ల మీద తీశారు. దానికి రాజమౌళి క్లాప్ కొత్తగా, ప్రశాంత్ నీల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

janhvikapoor-rajamouli1.jpg

అయితే ఈ అధికారిక లాంచ్ అవక ముందు రాజమౌళి, జాన్వి కపూర్ తో చాలా సేపు మాట్లాడేడు. అలాగే జాన్వి కపూర్ కి ఒక పేపర్ ఇచ్చి, ఆమెతో ఏదో రాయించుకున్నాడు. చాలామంది రాజమౌళి తాను తీయబోయే తదుపరి సినిమా మహేష్ బాబు (Mahesh Babu) తో కదా, అతని పక్కన జాన్వి కపూర్ ని కథానాయికగా తీసుకోవడానికి ఆమెతో సంతకం పెట్టించుకున్నాడు అని చాలామంది భావించారు.

janhvikapoor-rajamouli.jpg

కానీ అది కాదు. ఇంతకీ విషయం ఏంటి అంటే, రాజమౌళి కూతురు మయూక (Mayookha) జాన్వి కపూర్ కి పెద్ద అభిమాని అని తెలిసింది. రాజమౌళి ఎలాగూ ఈ ప్రారంభోత్సవానికి హాజరు అవుతున్నాడు కదా, అందుకని రాజమౌళి కూతురు జాన్వి కపూర్ ఆటోగ్రాఫ్ కావాలని అడిగిందిట. అందుకని రాజమౌళి జాన్వి కపూర్ తో ఆటోగ్రాఫ్ చేయించుకున్నాడు. మొదట ఒక కాగితం మీద ఆమె సంతకం చేసిన జాన్వి కపూర్ అలా వద్దు, ఏదైనా స్పూర్తిదాయకం అయిన మాటలు రాశి, కూతురి పేరు కూడా రాయమని అడిగితే, జాన్వి మళ్ళీ ఇంకో పేపర్ మీద అలాగే రాశి ఇచ్చింది. రాజమౌళి ఆ పేపర్లను జాగ్రత్తగా పెట్టుకొని, ఇంటికెళ్ళి తన కూతురికి ఇస్తాడు. అదీ విషయం.

Updated Date - 2023-03-23T11:43:17+05:30 IST