Vishwak Sen : ఆవేశంతోనో.. అహంకారంతోనో తీసుకున్న నిర్ణయం కాదు!

ABN , First Publish Date - 2023-10-29T13:28:09+05:30 IST

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకుడు. ఈ చిత్రం విడుదలను ఉద్దేశించి విశ్వక్ సేన్ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. సినీ పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోతే ఇబ్బందిపెట్టాలనే చూస్తుంటారని అన్నారు.

Vishwak Sen : ఆవేశంతోనో.. అహంకారంతోనో తీసుకున్న నిర్ణయం కాదు!

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకుడు. ఈ చిత్రం విడుదలను ఉద్దేశించి విశ్వక్ సేన్ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. సినీ పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోతే ఇబ్బందిపెట్టాలనే చూస్తుంటారని అన్నారు. మా సినిమా మొదట ఏ డేట్‌ అనుకున్నామో.. అదే డేట్‌కి విడుదలవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ‘‘బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోతే ప్రతి ఒక్కడూ మన గేమ్‌ మారుద్దాం అనుకుంటాడు. ఈ సినిమా కోసం ప్రతి ఫ్రేమ్‌లో ప్రాణం పెట్టి పనిచేసి చెప్తున్నా. డిసెంబర్‌ 8న వస్తున్నాం. హిట్‌, ఫ్లాప్‌, సూపర్‌హిట్‌, డిజాస్టర్‌ ఏదనేది ప్రేక్షకుల నిర్ణయం. ఆవేశంతోనో లేదా అహంకారంతోనో తీసుకున్న నిర్ణయం కాదిది. మంచి కోసం తగ్గేకొద్దీ మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారని అర్థమైంది. డిసెంబర్‌ 8న సివాలెత్తిపోద్ది. గంగమ్మతల్లిపై ఒట్టు. మహాకాళి మాతో ఉంది. డిసెంబర్‌లో కనుక మా సినిమా విడుదల కాకపోతే ఇకపై నన్ను ప్రమోషన్స్‌లో కూడా చూడరు’’ అంటూ విశ్వక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మాటలు చర్చనీయాంశమయ్యాయి.

‘దాస్‌ కా ధమ్కీ’ తర్వాత విశ్వక్ సేన్ నటిస్తోన్న చిత్రమిది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌, వినోదం మిళితం చేసిన కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. నేహాశెట్టి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. డిసెంబర్‌ 8న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన చేస్తోంది. అదే సమయంలో నితిన్‌ ‘ఎక్స్‌ట్రా’, వరుణ్‌ తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సైతం రిలీజ్‌ కానున్నాయి. ఆయా చిత్రాలను దృష్టిలో పెట్టుకుని ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ని వాయిదా వేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని, ఈ విషయంపై విశ్వక్‌ అసహనానికి లోనయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఈ పోస్ట్‌ పెట్టారని తెలుస్తోంది.

Vishwak.jpg

Updated Date - 2023-10-29T13:28:39+05:30 IST