Sehwag - Adipurush: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసింది!

ABN , First Publish Date - 2023-06-25T16:04:39+05:30 IST

ఆదిపురుష్‌’ చిత్రం విడుదలై పది రోజులు కావొస్తున్నా విమర్శల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ‘‘ఆదిపురుష్‌’ చూసిన తర్వాత అర్థమైంది’’ అంటూ సెటైర్‌ వేశాడు.

Sehwag - Adipurush: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసింది!

'ఆదిపురుష్‌’ (Adipurush) చిత్రం విడుదలై పది రోజులు కావొస్తున్నా విమర్శల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag Comments) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ‘‘ఆదిపురుష్‌’ చూసిన తర్వాత అర్థమైంది’’ అంటూ సెటైర్‌ వేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. నెటిజన్లు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా చూసి మాట్లాడుతున్నారా? లేక చడాకుండానే కామెంట్లు చేస్తున్నారాఅని ఫ్యాన్స్‌ సెహ్వాగ్‌పై మండిపడుతున్నారు.

రామాయణం ఇతివృత్తంగా ఓంరౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) శ్రీరాముడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే! సీతగా కృతీసనన్‌, లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. ఈ చిత్రం విడుదలైన రోజు నుంచీ విమర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా హనుమంతుడి డైలాగ్స్‌ విషయంలో వివాదం నెలకొంది. దర్శకుడు, రచయాలు రామాయణంపై అవగాహన లేకుండా సినిమా తీశారని అందుకే నిదర్శనమే ఈ చిత్రమని సినీ, రాజకీయ ప్రముఖులు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హనుమంతుడికి సంబంధిచిన సంభాషణల్లో మార్పులు చేశారు.

Updated Date - 2023-06-25T16:04:39+05:30 IST