Vijay Devarakonda : కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నా!

ABN , First Publish Date - 2023-09-01T14:02:05+05:30 IST

‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ చిత్రాల తర్వాత విజయ్‌ దేవరకొండ సరైన విజయం అందుకోలేదు. గత ఏడాది విడుదలైన ‘లైగర్‌’ ఘోర పరాజయం చూసిన సంగతి తెలిసిందే. తదుపరి చిత్రం ‘ఖుషి’ఫైనే ఆయన గురి పెట్టారు. సమంత కథానాయికగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘ఖుషి’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మేరకు విజయ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు.

Vijay Devarakonda : కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నా!

‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ చిత్రాల తర్వాత విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) సరైన విజయం అందుకోలేదు. గత ఏడాది విడుదలైన ‘లైగర్‌’ ఘోర పరాజయం చూసిన సంగతి తెలిసిందే. తదుపరి చిత్రం ‘ఖుషి’ఫైనే (Kushi) ఆయన గురి పెట్టారు. సమంత కథానాయికగా శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహించిన ‘ఖుషి’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మేరకు విజయ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ వైరల్‌ అవుతుంది.

‘‘నా విజయం కోసం నన్ను అభిమానించే వారంతా 5 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు. నేను మంచి సినిమా చేస్తానని ఓపిగ్గా ఎదురుచూశారు. ఈరోజు ‘ఖుషి’తో చేసి చూపించా. ఉదయం మేల్కొవడమే శుభవార్త విన్నాను. నా చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంతో నన్ను నిద్రలేపారు. వందల మెేసజ్‌లతో నా ఫోన్‌ ఇన్‌బాక్స్‌ నిండిపోయింది. వరుసగా ఫోన్‌లు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నా. మీ కుటుంబంతో వెళ్లి సినిమాను ఎంజాయ్‌ చేయండి. మీరంతా ‘ఖుషి’ని ఆదరిస్తారని నాకు తెలుసు. లవ్యూ ఆల్‌’’ అని రాశారు. దీనికి ఎమోషనల్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా విజయ్‌ దేవరకొండ జోడించారు. సినిమా విడుదలకు ముందు కూడా విజయ్‌ ఓ వీడియో ట్వీట్‌ చేశారు. ‘అప్పుడే ఈ చిత్రం రిలీజ్‌ వరకూ వచ్చిందంటే నమ్మలేకపోతున్నా. మీరంతా నన్ను ఆన్‌స్ర్కీన్‌ చూసి సంవత్సరం అవుతోంది. మీ అందరి ముఖాల్లో చిరునవ్వు చూడడం కోసం నేనెంతగా ఎదురుచూస్తున్నానో మాటల్లో చెప్పలేను’ అని అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. సమంత కథానాయిక.

Updated Date - 2023-09-01T14:02:05+05:30 IST