సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Venky atluri : అదే బ్యానర్‌లో ముచ్చటగా మూడో సినిమా!

ABN, First Publish Date - 2023-04-06T14:06:46+05:30

పలు చిత్రాలకు రచయితగా పని చేసి దర్శకుడిగా మారారు వెంకీ అట్లూరి. మొదటి చిత్రం ‘తొలిప్రేమ’తో సూపర్‌హిట్‌ సాధించి దర్శకుడిగా నిరూపించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలు చిత్రాలకు రచయితగా పని చేసి దర్శకుడిగా మారారు వెంకీ అట్లూరి(Venky Atluri). మొదటి చిత్రం ‘తొలిప్రేమ’(tholiprema)తో సూపర్‌హిట్‌ సాధించి దర్శకుడిగా నిరూపించుకున్నారు. తదుపరి ‘మిస్టర్‌ మజ్ను’, ‘రంగ్‌దే’ చిత్రాలను తెరకెక్కించి పర్వాలేదనిపించారు. తాజాగా విడుదలైన ధనుష్‌ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ‘సార్‌’(వాతి) (vaathi) చిత్రంతో సూపర్‌ సక్సెస్‌ అందుకున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన చిత్రమిది. ‘రంగ్‌దే’ చిత్రం కూడా ఈ బ్యానర్‌లోనే రూపొందింది. ఇప్పుడు ఇదే బ్యానర్‌లో ముచ్చటగా మూడో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. గురవారం వెంకీ అట్లూరి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సితారా (Sithara Entertainments) సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. ‘‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నం.24 వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఉండబోతోంది. ఆయనతో చేస్తున్న మూడో చిత్రమిది’’ అని పేర్కొన్నారు. (Venky Atluri Next with Sithara entertainments)

ప్రస్తుతం సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో వరుస చిత్రాలు తెరకెక్కుతున్నాయి. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ‘టిల్లు స్వ్కేర్‌’, పంజా వైష్టవ్‌తేజ్‌4’,తోపాటు మరో చిత్రం సెట్స్‌ మీదున్నాయి. అయితే వెంకీ అట్లూరి చిత్రం ఎవరితో ఉండబోతోంది, ఏ జానర్‌ కథ అన్న ఇంకా వెల్లడించలేదు.

Updated Date - 2023-04-06T14:08:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!