Pawan kalyan : కీలక భాగం పూర్తి.. ఎప్పటిలాగే పవర్స్టార్ ఇరగదీశారు!
ABN , First Publish Date - 2023-10-01T11:16:53+05:30 IST
పవన్ కల్యాణ్(Pawan kalyan), హరీశ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో 11 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత సింగ్’.Ustaad Bhagat singh) మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవల కొత్త షెడ్యూల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
![Pawan kalyan : కీలక భాగం పూర్తి.. ఎప్పటిలాగే పవర్స్టార్ ఇరగదీశారు!](https://media.chitrajyothy.com/media/2023/20230730/Pawan_kalyan_683b501b20.jpeg)
పవన్ కల్యాణ్(Pawan kalyan), హరీశ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో 11 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత సింగ్’.Ustaad Bhagat singh) మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవల కొత్త షెడ్యూల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్లో పవనకల్యాణ్పై పవర్ ప్యాక్డ్ సీన్స్ చిత్రీకరించారు. ఈ విషయం గురించి దర్శకుడు హరీశ శంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ఉస్తాద్ భగత్ సింగ్’లోని అత్యంత ముఖ్యమైన భాగం చిత్రీకరణ పూర్తయ్యింది. పవన్ కల్యాణ్ ఎప్పటిలాగే పవర్ఫుల్గా నటించారు’’ అని ఆయన పేర్కొన్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్థమవుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
పవన మరోవైపు ఓజీ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. నాలుగో విడత వారాహి విజయ యాత్ర పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. సుజీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.