SSMB29: ఆ ముగ్గురు హీరోయిన్లలో ఎవర్ని ఫైనల్‌ చేస్తారో?

ABN , First Publish Date - 2023-04-10T12:30:59+05:30 IST

మహేశ్‌బాబు(Maheshbabu).. రాజమౌళి (Rajamouli).. 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) .. ఈ కాంబో కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంకా సినిమా సెట్స్‌ మీదకు వెళ్లలేదు కానీ రోజుకో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

SSMB29: ఆ ముగ్గురు హీరోయిన్లలో ఎవర్ని ఫైనల్‌ చేస్తారో?

మహేశ్‌బాబు(Maheshbabu).. రాజమౌళి (Rajamouli).. 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) .. ఈ కాంబో కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంకా సినిమా సెట్స్‌ మీదకు వెళ్లలేదు కానీ రోజుకో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. భారీ అంచనాలు మొదలైపోయాయి. యాక్షన్‌ అడ్వెంచర్‌ (Action Adventure) డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోందని హింట్‌ ఇచ్చారు. హీరో, దర్శకుడు, బ్యానర్‌ మినహా సినిమాకు సంబంధించి ఏదీ అధికారికంగా ప్రకటించలేదు. హీరోయిన్లు ఎవరు, ఎంతమంది అన్నది ఇంకా తెలీదు. కానీ ఎవరి ఊహల్లో వారు ఉన్నారు.

మూడు రోజుల క్రితం అలా...

మూడు రోజుల క్రితం ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేసింది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఇద్దరు తమిళ సూపర్‌స్టార్‌లను, ఓ మలయాళ స్టార్‌ను సంప్రదించారనే వార్త ట్రెండ్‌ అయింది. ఆ పాత్ర కోసం విశ్వనాయకుడు కమల్‌హాసన్‌తో టచ్‌లోకి వెళ్లినట్లు ఆరు క్రితమే ఓ వార్త బయటికొచ్చింది. ఇప్పుడు కమల్‌హాసన్‌తోపాటు చియాన్‌ విక్రమ్‌ను, మలయాళం నుంచి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పేర్లు కూడా వినిపిసున్నాయి. మరి కమల్‌హాసన్‌, విక్రమ్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ ముగ్గురుకి ఈ చిత్రంలో ఛాన్‌ ఉందా? లేక ముగ్గురిలో ఒకర్ని సెలెక్ట్‌ చేస్తారా అన్నది చూడాలి.

ఇప్పుడు ఇలా...

‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’(SSMB29) లో ముగ్గురు హీరోయిన్‌లకు స్కోప్‌ ఉందని మొదటి నుంచి వినిపిస్తోంది. ఇప్పుడీ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. మహేశ్‌బాబు పక్కన హీరోయిన్‌గా అలరించేది ఎవరా? అని సెర్చింగ్‌ మొదలైంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పడుకోన్‌ (Deepika padukone) ఓ కథానాయిక అని చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. సెకెండ్‌ లీడ్‌లో హాలీవుడ్‌ హీరోయిన్‌ జెన్నా ఒర్టెగా ( jenna ortega) కనిపించనుందని టాక్‌ వినిపిస్తోంది. ఇప్పుడు తెరపైకి మరో పేరొచ్చింది. మూడో హీరోయిన్‌గా అతిలోకసుందరి శ్రీదేవి గారాల కూతురు జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) కూడా ఈ చిత్రంలో భాగం కానుందనే వార్త సోమవారం నెట్టింట వైరల్‌ అవుతోంది. బోనీకపూర్‌ స్వయంగా రాజమౌళిని రిక్వెస్ట్‌ చేశారని ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతోంది. మరి వీరిలో ఎవర్ని జక్కన్న ఫైనల్‌ చేస్తారో చూడాలి. ప్రస్తుతం మహేశ్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ఎంబీ28 చేస్తున్న సంగతి తెలిసింది. తదుపరి రాజమౌళి సెట్‌లో అడుగుపెడతారు మహేశ్‌. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లనుందని సమాచారం.

Updated Date - 2023-04-10T12:40:45+05:30 IST