సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Veerasimha reddy: దర్శకుడికి రజనీకాంత్‌ ఫోన్‌!

ABN, First Publish Date - 2023-01-30T12:41:45+05:30

వీరసింహారెడ్డి వంటి మాస్ట్‌ మసాలా యాక్షన్‌ చిత్రంతో సక్సెస్‌ అందుకున్న చిత్ర బృందానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్వయంగా ఫోన్‌ చేసి అభినందించారు. వీర సింహారెడ్డి చిత్రాన్ని వీక్షించిన ఆయన దర్శకుడికి ఫోన్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరసింహారెడ్డి (Veerasimha reddy) వంటి మాస్ట్‌ మసాలా యాక్షన్‌ చిత్రంతో సక్సెస్‌ అందుకున్న చిత్ర బృందానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajnikanth) స్వయంగా ఫోన్‌ చేసి అభినందించారు. వీర సింహారెడ్డి చిత్రాన్ని వీక్షించిన ఆయన దర్శకుడికి ఫోన్‌ చేశారు. ఈ విషయాన్ని గోపీచంద్‌ మలినేని (gopichand maineni) స్వయంగా వెల్లడించారు. ‘‘ఇది నాకొక అద్భుతమైన క్షణం. తలైవా రజనీకాంత్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. వీర సింహారెడ్డి చిత్రాన్ని చూశానని, సినిమా ఎంతగానో నచ్చిందని ఆయన నాతో చెప్పారు. మా సినిమా గురించి ఆయన చెప్పిన మాటలు, పలు సన్నివేశాల్లో ఆయనకు కలిగిన ఆయనకు కలిగిన భావోద్వేగం.. ఇంతకంటే ఈ ప్రపంచంలో విలువైనది ఇంకేదీ లేదనిపిస్తోంది నాకు. థ్యాంక్యూ రజని సర్‌’’ అని గోపీచంద్‌ మలినేని ట్వీట్‌తో ఆనందం వ్యక్తం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ కథానాయిక. హనీరోజ్‌ మరో నాయిక. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్లింది.

Updated Date - 2023-01-30T12:41:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!