Alekhya Tarakaratna: ప్రతిక్షణం గుర్తొస్తున్నావ్‌ ఓబు!

ABN , First Publish Date - 2023-04-09T15:21:42+05:30 IST

నందమూరి తారకరత్న(Nandamuri Tarakaratna) మరణం ఆయన కుటుంబంలో, అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది

Alekhya  Tarakaratna: ప్రతిక్షణం గుర్తొస్తున్నావ్‌ ఓబు!

నందమూరి తారకరత్న(Nandamuri Tarakaratna) మరణం ఆయన కుటుంబంలో, అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది. ఆయన మరణించి రెండు నెలలు కావొస్తుంది, ఆయన తాలుక జ్ఞాపకాలు భార్య అలేఖ్య, పిల్లలు తలచుకుంటూనే ఉంటున్నారు. తారకరత్న మరణాన్ని (tarakaranta memories) జీర్ణించుకోలేకపోతున్నారు. భర్తను కోల్పోయిన అలేఖ్యా Alekhya reddy) తరచు అతని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా శనివారం రాత్రి మరో పోస్ట్‌ పెట్టి ఎమోషనల్‌ అయ్యారు. పిల్లలతో తారకరత్న గడిపిన క్షణాల్ని షేర్‌ చేసి ‘నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా ఉండలేకపోతున్నా అంటూ ఇన్‌స్ట్టాలో పంచుకుంది. ఈ వీడియో చూసిన నెటిసన్లు ‘మాకే చాలా బాధగా అనిపిస్తుంది. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న మీరు ఆయన లేకుండా ఎలా తట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. కానీ మీ పెయిన్‌ అర్థమవుతోంది. ధైర్యంగా ఉండండి మేడమ్‌’’ అంటూ నెటిజన్లు అలేఖ్యాకు ధైర్యం చెబుతున్నారు. జనవరి 27న నారా లోకేశ్‌ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలారు తారకరత్న. కుప్పం సమీప ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ 23 రోజులపాటు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. (AlekhyaTarkaratna emotional post)

తారకరత్న, అలేఖ్యారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాంతో కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయినా ఎక్కడా నిరుత్సాహ పడకుండా జీవితాన్ని కొనసాగించారు. ఈ జర్నీలో నందమూరి బాలకృష్ణ తారకరత్న అండగా నిలిచారు. తారకరత్న ఆస్పత్రి పాలైన సందర్భంలోనూ బాబాయ్‌గా బాలకృష్ణ తన బాధ్యతగా దగ్గరుండి చూసుకున్నారు. తారకరత్న మరణించిన తర్వాత కూడా జరగాల్సిన కార్యక్రమాలన్నీ బాలకృష్ణే దగ్గరుంచి చూసుకున్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు అలేఖ్యా రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ‘కష్టమన్న ప్రతిసారీ మాకు అండగా నిలిచారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేని మామయ్య’’ అని పోస్ట్‌లు చేశారు. ఆమె పోస్ట్‌లు ఇప్పటికీ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - 2023-04-09T15:21:45+05:30 IST