Suhasini : అతని ఒళ్ళో కూర్చోమన్నారు.. నేనైతే అసలు ఒప్పుకోలేదు..

ABN , First Publish Date - 2023-10-14T17:33:23+05:30 IST

సుహాసిని.. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు పరిచయం అక్కర్లేని కథానాయిక. ఒకప్పుడు స్టార్‌ హీరోయినగా అగ్ర హీరోలు అందరితో స్ర్కీన షేర్‌ చేసుకుంది. తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటిగా ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు.

Suhasini : అతని ఒళ్ళో కూర్చోమన్నారు.. నేనైతే అసలు ఒప్పుకోలేదు..

సుహాసిని.. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు పరిచయం అక్కర్లేని కథానాయిక. ఒకప్పుడు స్టార్‌ హీరోయినగా అగ్ర హీరోలు అందరితో స్ర్కీన షేర్‌ చేసుకుంది. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో భాగమైంది. ఆమె నటనతోపాటు పాటలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, తన భర్త మణిరత్నం నిర్మిస్తున్న చిత్రాలకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటిగా ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు.

‘‘గతంలో నేను నటించిన ఓ సినిమా సెట్‌లో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నా. ఓ సీనలో షూట్‌ చేస్తున్నప్పుడు హీరో ఒడిలో కూర్చోమన్నారు. దానికి నేను ససేమిరా ఒప్పుకోలేదు. ‘‘ఇది భారతదేశం. ఇక్కడ పరాయి వ్యక్తి ఒడిలో ఒక స్ర్తీ కూర్చోవడం తప్పు. కాబట్టి నేను ఈ సీన్‌ చేయను’’ అని గట్టిగా చెప్పా. మరో షాట్‌లో హీరో తినే ఐస్‌క్రీమ్‌నే నేను తినాలన్నారు. నాకు అది నచ్చలేదు. ‘వేరే వాళ్లు ఎంగొలి చేసింది నేను ఎందుకు తినాలి? ఐస్‌క్రీమ్‌ మార్చండి. లేదంటే సీన్‌ మార్చండి?’’ అని గట్టిగా సమాధానమిచ్చా. నా మాటలు విని మా కొరియోగ్రాఫర్‌ షాకయ్యారు. తాను చెప్పిందే చేయాలన్నారు. నేను ఒప్పుకోలేదు. ఆ ఐస్‌క్రీమ్‌ను కనీసం ముట్టుకోనని చెప్పా’’ అని సుహాసిని అన్నారు.

అలాగే మరోనటి, తన స్నేహితురాలు నటి శోభనకు కూడా ఇలాంటే పరిస్థితే ఎదురైందని సుహాసిని అన్నారు. ‘‘శోభన నటించిన ఓ సినిమాలో ఇలాంటి సీన్‌నే పెట్టారు. సీన్‌ నచ్చకపోవడంతో తను చేయనని చెప్పింది. దానికి ఆ చిత్ర దర్శకుడు ‘నువ్వేమైనా సుహాసిని అనుకుంటున్నావా? చేయను అనడానికి' అన్నాడట. ఆమె వెంటనే నాకు ఫోన్‌ చేసి జరిగింది చెప్పింది. సీన్‌ నచ్చకపోతే చేయనని అందరికీ తెలిసిందని అప్పుడు అర్థమైంది’’ అని తెలిపారు.

Updated Date - 2023-10-14T18:12:53+05:30 IST