SSMB28: త్రివిక్రమ్‌ భారీగానే ప్లాన్‌ చేశాడు!

ABN , First Publish Date - 2023-02-26T18:19:38+05:30 IST

‘అతడు’, ‘ఖలేజ’ చిత్రాల తర్వాత మూడోసారి మహేశ్‌ (mahesh babu)- త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌ రిపీట్‌ కానుంది. ‘అతడు’ చిత్రం బాగానే ఆకట్టుకున్నా... ‘ఖలేజా’ మాత్రం పరాజయం పాలైంది. ఈసారి భారీ విజయం అందుకునే దిశగా త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

SSMB28: త్రివిక్రమ్‌ భారీగానే ప్లాన్‌ చేశాడు!

‘అతడు’, ‘ఖలేజ’ చిత్రాల తర్వాత మూడోసారి మహేశ్‌ (mahesh babu)- త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌ రిపీట్‌ కానుంది. ‘అతడు’ చిత్రం బాగానే ఆకట్టుకున్నా... ‘ఖలేజా’ మాత్రం పరాజయం పాలైంది. ఈసారి భారీ విజయం అందుకునే దిశగా త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. మహేశ్‌ నటిస్తున్న 28వ చిత్రంతో హ్యాట్రిక్‌ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ఎస్‌ఎస్‌ఎంబీ 28’(SSMB28) వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సారధి స్టూడియోలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. అక్కడ కార్‌ బ్లాస్టింగ్‌ వంటి పోరాట సన్నివేశాలను తెరకెక్కించారు త్రివిక్రమ్‌. ఇటీవల ఫారిన్‌ ట్రిప్‌కి వెళ్లొచ్చిన మహేశ్‌ సెట్‌లో అడుగుపెట్టనున్నారు. సోమవారం నుంచి ఒక హౌస్‌ సెట్‌లో చిత్రీకరణ ప్రారంభింస్తారని టాక్‌ వినిపిస్తోంది. ఈ షెడ్యూల్‌లో పూజా హెగ్డే (Pooja hegde)సెట్‌లో అడుగుపెట్టనుంది. హైదరాబాద్‌ శివార్లో పది కోట్ల బడ్జెట్‌తో వేసిన భారీ హౌస్‌లో సెట్‌లో మహేశ్‌ బాబు, పూజా, ప్రకాశ్‌రాజ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల (Shri leela) కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొనుంది. వీరితోపాటు ఓ కీలక సన్నివేశం కోసం భూమి పెడ్నేకర్‌ కూడా సెట్‌లో అడుగుపెట్టనుందట. సెకెండాఫ్‌లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందనీ, ఆమెది పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర అని వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఒకే సారి ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ సెట్‌లో ముగ్గురు హీరోయిన్లు అడుగుపెట్టబోతున్నారనమాట. ఇంతే కాదు మరో ఆసక్తికర విషయం కూడా నెట్టింట వైరల్‌ అవుతోంది. సీనియర్‌ నటి రమ్యకృష్ణ కూడా ఈ చిత్రంలో ఓ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (S Radha krishna) (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-02-26T18:19:39+05:30 IST