SSMB28: ఇంటెన్స్‌ లుక్‌ అదిరింది!

ABN , First Publish Date - 2023-05-29T17:09:56+05:30 IST

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఎస్‌ఎస్‌ఎంబీ28 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ఈ చిత్రానికి ‘గుంటూరు కారం’ టైటిల్‌ ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న ఈ చిత్రం టైటిల్‌ను, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయనున్నారు.

SSMB28: ఇంటెన్స్‌ లుక్‌ అదిరింది!

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు (Mahesh babu)మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌లో ఎస్‌ఎస్‌ఎంబీ28(SSMB28) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ఈ చిత్రానికి ‘గుంటూరు కారం’ టైటిల్‌ ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి (krishna Jayanthi)సందర్భంగా ఈ నెల 31న ఈ చిత్రం టైటిల్‌ను, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈలోపు చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగేలా మేకర్స్‌ ప్రమోషన్స్‌ చేస్తున్నారు. రోజుకో ఆసక్తికర వార్తను వదులుతూ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నారు.

కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను, ‘మాస్‌ స్ర్టైక్‌’ (Mass strike)పేరుతో టైటిల్‌ టీజర్‌ను విడుదల చేయనున్నారు. కృష్ణ ఆల్‌ టైం హిట్స్‌లో ఒకటైన ‘మోసగాళ్ళకు మోసగాడు’ (Mosagallaku mosagaadu)చిత్రాన్ని ఆయన జయంతి కానుకగా మే 31న 4కె ఫార్మెట్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే! ఆ సినిమా ప్రదర్శించనున్న అన్ని థియేటర్లలో ‘ఎస్‌ఎస్‌ఎంబి 28’ చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో కూడిన గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. పైగా ఈ విడుదల కార్యక్రమం అభిమానుల చేతలుమీదుగా జరగనుంది. అభిమానుల చేతులమీదుగా ‘మాస్‌ స్ర్టైక్‌’ పేరుతో విడుదలవుతున్న ఈ గ్లింప్స్‌ అభిమానులకి మాస్‌ ఫీస్ట్‌ అవుతుందని చిత్ర బృందం చెబుతోంది. దీనికి సంబంధించిన రెండో లుక్‌ మాస్‌ స్ట్రైక్‌ మరో రెండు రోజుల్లో రానుంది అంటూ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ ట్విట్టర్‌ వేడుకగా విడుదల చేసింది. ఇంటెన్స్‌ లుక్‌లో మహేశ్‌ స్టిల్‌ ఆకట్టుకుంటుంది. యాక్షన్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన లుక్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్‌ సినిమాల తర్వాత మహేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఎస్‌.రాధాకృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే, శ్రీలీలా కథానాయికలు.

Updated Date - 2023-05-29T17:54:38+05:30 IST