SSMB28: టైటిల్‌ వింటే మంటెక్కిపోద్ది!

ABN , First Publish Date - 2023-05-27T13:39:08+05:30 IST

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే ఈ చిత్రానికి రెండు మూడు టైటిళ్లు పరిశీలించారు. వాటిలో ‘అమరావతికి అటూ ఇటూ’ టైటిల్‌ అనుకున్నారు. తాజాగా ‘గుంటూరు కారం’ టైటిల్‌ వినిపిస్తోంది. ఆల్మోస్ట్‌ ఈ టైటిల్‌ ఖాయం చేసిననట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

SSMB28: టైటిల్‌ వింటే మంటెక్కిపోద్ది!

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు (Mahesh babu) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (trivikram)కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే ఈ చిత్రానికి రెండు మూడు టైటిళ్లు పరిశీలించారు. వాటిలో ‘అమరావతికి అటూ ఇటూ’ టైటిల్‌ అనుకున్నారు. తాజాగా ‘గుంటూరు కారం’ (guntur Kaaram) టైటిల్‌ వినిపిస్తోంది. ఆల్మోస్ట్‌ ఈ టైటిల్‌ ఖాయం చేసిననట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న ఈ చిత్రం టైటిల్‌ను, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయనున్నారు. మొదట ఈ చిత్రానికి ‘అమరావతికి అటూ ఇటూ’ (Amaravatiki atu itu) టైటిల్‌ ఖరారు చేశారని టీజర్‌ కట్‌ చేస్తే చూస్తే మరీ మాస్‌గా ఉందని, మహేష్‌ క్యారెక్టరైజేషన్‌కి, టైటిల్‌కీ, కట్‌ చేసిన టీజర్‌కీ మ్యాచ్‌ కాకపోవడంతో ఫైనల్‌గా ‘గుంటూరు కారం’ అయితే బాగుంటుందని దానినే ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం టైటిల్‌ను ప్రత్యేకంగా ఆవిష్కరించనున్నారు. కృష్ణ ఆల్‌ టైం హిట్స్‌లో ఒకటైన ‘మోసగాళ్ళకు మోసగాడు’ (mosagallaku mosagaadu)చిత్రాన్ని ఆయన జయంతి కానుకగా మే 31న 4కె ఫార్మెట్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే! ఆ సినిమా ప్రదర్శించనున్న అన్ని థియేటర్లలో ‘ఎస్‌ఎస్‌ఎంబి 28’ చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో కూడిన గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. పైగా ఈ విడుదల కార్యక్రమం అభిమానుల చేతలుమీదుగా జరగనుంది. అభిమానుల చేతులమీదుగా ‘మాస్‌ స్ర్టైక్‌’ పేరుతో విడుదలవుతున్న ఈ గ్లింప్స్‌ అభిమానులకి మాస్‌ ఫీస్ట్‌ అవుతుందని చిత్ర బృందం చెబుతోంది. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్‌ సినిమాల తర్వాత మహేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఎస్‌.రాధాకృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే, శ్రీలీలా కథానాయికలు.

Updated Date - 2023-05-27T13:39:08+05:30 IST