Sithara entertainments : మరో మల్టీస్టారర్‌...

ABN , First Publish Date - 2023-01-20T11:56:08+05:30 IST

అగ్ర నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మరో రీమేక్‌కు శ్రీకారం చుట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఏడాది పవన్‌ కల్యాణ్‌-రానా హీరోలుగా మల్లీస్టారర్‌ ‘భీమ్లానాయక్‌’ ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే!

Sithara entertainments : మరో మల్టీస్టారర్‌...

అగ్ర నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌(sithara entertainments) మరో రీమేక్‌కు (Another remake)శ్రీకారం చుట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఏడాది పవన్‌ కల్యాణ్‌-రానా హీరోలుగా మల్లీస్టారర్‌ ‘భీమ్లానాయక్‌’ ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! తాజాగా సితార నుంచి మరో ఇద్దరు హీరోలతో ఓ చిత్రం రాబోతుంది. ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాటపర్వం’ చిత్రాలతో ఆకట్టుకొన్న వేణు ఉడుగులతో(Venu udugula).. సితార సంస్థ ఓ భారీ చిత్రాన్ని ప్ల్లాన్‌ చేసింది. ఇందులో ఇద్దరు హీరోలుంటారు. 50 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తికీ, పాతికేళ్ల కుర్రాడికీ మధ్య సాగే కథ ఇది. ఈ కథ కోసం అగ్ర హీరోలను అనుకుంటున్నారని తెలిసింది. ఇద్దరూ తెలుగు హీరోలు కుదరకపోతే తమిళం నుంచి ఓ స్టార్‌ను, తెలుగు నుంచి ఓ స్టార్‌ను తీసుకునే అవకాశం ఉందని టాక్‌. అదీ కుదరకపోతే ఇద్దరూ తమిళ హీరోల్నే తీసుకుని అవకాశాలు ఉన్నాయని టీమ్‌ చెబుతున్నారు. అయితే తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలంతా బిజీగా గడుపుతున్నారు. కాల్షీట్లు దొరకడం కష్టంగా మారడంతో ఇంకా ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లేది. కథ సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి హీరోలు ఎవరనేది ఫిబ్రవరి నెలాఖరుకు తెలుస్తోంది. దర్శకుడు వేణు ఇప్పటికే మైత్రీ సంస్థ దగ్గర అడ్వాన్స్‌ తీసుకున్నాడు. ఆ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందనే తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-01-20T11:56:10+05:30 IST