Shobu Yarlagadda : అనుమతి లేకుండా చేసిన పని!

ABN , First Publish Date - 2023-09-26T12:47:35+05:30 IST

ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘బాహుబలి’ (bahubali) చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే.

Shobu Yarlagadda : అనుమతి లేకుండా చేసిన పని!

ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘బాహుబలి’ (bahubali) చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటింది. ‘బాహుబలి’ పాత్రధారి ప్రభాస్‌ మైనపు విగ్రహాన్ని మేడమ్‌ టుస్సాడ్స్‌లోనూ ఏర్పాటు చేశారు. తాజాగా మైసూర్‌లోని ఓ మ్యూజియంలోనూ అమరేంద్ర బాహుబలి పాత్రకు సంబంధించిన మైనపు విగ్రహం ఒకటి తయారు చేశారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ (Shobhu Yarlagadda) ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఇది అనుమతి తీసుకుని చేసిన పని కాదు. మాకు తెలియకుండా, మా దృష్టికి తీసుకురాకుండా బొమ్మను తయారు చేసి పెట్టారు. విగ్రహాన్ని తొలగించేలా తగిన చర్యలు తీసుకుంటాం’’ అని ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు.

Updated Date - 2023-09-26T12:47:35+05:30 IST