Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

ABN , First Publish Date - 2023-02-26T12:47:41+05:30 IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎవరంటే.. ఎవరైనా టక్కున చెప్పే పేరు సమంత (Samantha). సినీ పరిశ్రమలో ఎటువంటి సపోర్టు లేకుండా అంచెలంచెలుగా ఈ స్థాయికి చేరుకుంది.

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్
Samantha

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎవరంటే.. ఎవరైనా టక్కున చెప్పే పేరు సమంత (Samantha). సినీ పరిశ్రమలో ఎటువంటి సపోర్టు లేకుండా అంచెలంచెలుగా ఈ స్థాయికి చేరుకుంది. అయితే ఈ భామ గత కొంతకాలంగా మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఈ బ్యూటీ కొన్ని రోజులుగా సినిమా షూటింగులకి గ్యాప్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. అలాగే, తన సూపర్ హిట్ మూవీ ‘యశోద’ (Yashoda) సినిమాకి సైతం ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే డబ్బింగ్ చెప్పింది.

అయితే.. ఇటీవలే ఆ వ్యాధి నుంచి కాస్తా కోలుకున్న సామ్ తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటుంది. ఇటీవలే ‘శాకుంతలం’ (Shakunthalam) సినిమా షూటింగ్‌ని పూర్తి చేసింది. ఈ మూవీ త్వరలో బాక్సాఫీస్‌ ముందుకు రానుంది. నిజానికి ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న విడుదల చేయాలని దర్శకుడు గుణశేఖర్‌తో పాటు చిత్రబృందం అనుకుంది. కానీ పలు కారణాల వల్ల మూవీ రిలీజ్‌ని వాయిదా వేసింది. కాగా.. సామ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ (Khushi) అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే.. ‘ఫ్యామిలీ మ్యాన్’ (Family Man) దర్శక ద్వయం రాజ్, డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్‌’ అనే వెబ్‌సిరీస్‌లోనూ చేస్తోంది.

ఇది కూడా చదవండి:

Ram Miriyala: ‘చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా’

Marmayogi: అందరూ అలా అనుకున్నారు.. కానీ..

కాగా.. ఈ వెబ్‌సిరీస్ కోసం సమంత ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది. దీనికి సంబంధించిన ఫోటోను సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. దానికి ‘అందం, మృగం.. రెండూ నువ్వే’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో పలువురు సమంత కోలుకుని సినిమాలు చేస్తుండడం గురించి కామెంట్స్ చేస్తున్నారు. సమంత పూర్తి కోలుకుని, మరిన్నీ విజయవంతమైన చిత్రాల్లో నటించాలని సామ్ అభిమానులు కోరుకుంటున్నారు.

sam.jpg

Updated Date - 2023-02-26T12:49:05+05:30 IST