Samantha: మరోసారి క్లారిటీ ఇచ్చింది!

ABN , First Publish Date - 2023-05-07T19:09:36+05:30 IST

‘శాకుంతలం’తో పరాజయాన్ని చవిచూసిన సమంత ప్రస్తుతం హిందీలో ‘సిటాడెల్‌’ సిరీస్‌ చేస్తోంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ సిరీస్‌ కోసం చాలా కసరత్తులు చేస్తోంది.

Samantha: మరోసారి క్లారిటీ ఇచ్చింది!

‘శాకుంతలం’తో పరాజయాన్ని చవిచూసిన సమంత (Samantha) ప్రస్తుతం హిందీలో ‘సిటాడెల్‌’ (Citadel)సిరీస్‌ చేస్తోంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ సిరీస్‌ కోసం చాలా కసరత్తులు చేస్తోంది. యాక్షన్‌ సన్నివేశాల కోసం కష్టపడుతోంది. తాజాగా ఆమె నటిస్తున్న ‘సిటాడెల్‌’ సిరీస్‌ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇది రీమేక్‌ కాదని చెప్పింది. ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించిన హాలీవుడ్‌ సిరీస్‌ సిటాడెల్‌’ తాజగాఆ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎపిసోడ్‌ల వారీగా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ర్టీమింగ్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా సామ్‌ ప్రశ్నించారు. ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్‌ తెలుగులోనూ విడుదలైంది. అందరూ చూసేశారు కదా? మళ్లీ మీరు దాన్ని రీమేక్‌ చేయడం ఎందుకు?’ అని ఓ నెటిజన్‌ సామ్‌ను ప్రశ్నించాడు. దానికి సామ్‌ రిప్లై ఇస్తూ.. ఇది రీమేక్‌ కాదని చెప్పింది. దీనికి మరో నెటిజన్‌ ‘సిటాడెల్‌’ అన్ని దేశ భాషల్లోరూ తెరకెక్కుతోంది. ఇండియన్‌ వెర్షన్‌లో సమంత, వరుణ్‌ ధావన్‌ నటిస్తున్నారు. ఏ రీమేక్‌ చిత్రాన్ని అయినా ఆయా ప్రాంతాల నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేస్తుంటారు. ఇది అలాగే జరుగుతుందేమో’’ అని ట్వీట్‌ చేశారు. ఆ నెటిజన్‌ ట్వీట్‌కు సమంతలైక్‌ కొట్టారు. ప్రస్తుతం సమంత తెలుగులో ‘ఖుషి’ సినిమా చేస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ కథానాయకుడు. ఇప్పటికే 60 శాతం షూటింగ్‌ పూర్తయింది. శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు.

Updated Date - 2023-05-07T19:10:12+05:30 IST