Samantha: ఆ విలువ ఏంటో అర్థమైంది...

ABN , First Publish Date - 2023-08-21T14:20:58+05:30 IST

ఇటీవల ‘ఖుషి’ (Kushi) సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో సందడి చేసిన సమంత న్యూయార్క్‌ చేరుకున్నారు. అక్కడ జరిగిన ‘ఇండియా డే పరేడ్‌’లో (india day parade in new york) పాల్గొన్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా న్యూయార్క్‌లో నిర్వహించే ఈ వేడుకలు ఆదివారం మధ్యాహ్నం ఘనంగా జరిగాయి.

Samantha: ఆ విలువ ఏంటో అర్థమైంది...

ఇటీవల ‘ఖుషి’ (Kushi) సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో సందడి చేసిన సమంత న్యూయార్క్‌ చేరుకున్నారు. అక్కడ జరిగిన ‘ఇండియా డే పరేడ్‌’లో (india day parade in new york) పాల్గొన్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా న్యూయార్క్‌లో నిర్వహించే ఈ వేడుకలు ఆదివారం మధ్యాహ్నం ఘనంగా జరిగాయి. సమంతతో పాటు మరికొంతమంది నటీనటులు, ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ఈ వేడుకలో భాగమయ్యారు.

Untitled-4.jpg

ఈ సందర్భంగా సమంత మాట్లాడారు. ‘‘ఈరోజు న్యూయార్క్‌లో ఉండడం చాలా గర్వంగా ఉంది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంతగొప్పవో, ఈరోజు నేను చూసిన దృశ్యాలు మరోసారి నాకు అర్థమయ్యేలా చేశాయి. ఈ క్షణాలు నా మదిలో జీవితాంతం నిలిచి ఉంటాయి. అ అవకాశం ఇచ్చి అరుదైన గౌరవం దక్కేలా చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు. అక్కడున్న అభిమానులతో సమంత కాసేపు సరదాగా గడిపారు.

తాజాగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది 

Updated Date - 2023-08-21T14:23:03+05:30 IST