SS Rajamouli: టూర్‌కి వెళ్లారు.. మొక్కలు నాటారు..

ABN , First Publish Date - 2023-06-27T13:53:53+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ వేదికకు చేరుకోవడం, అక్కడ ప్రమోషన్స్‌, అవార్డు అందుకోవడం ఇలా దాదాపు రెండు మూడు నెలలు తన టీమ్‌తో క్షణం తీరిక లేకుండా గడిపారు రాజమౌళి. హైదరాబాద్‌ వచ్చిన వెంటనే పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. కొద్ది నెక్ట్స్‌ రోజులు తదుపరి చిత్రం ఎస్‌ఎస్‌ఎంబీ29 స్ర్కిప్ట్‌ పనులో బిజీ అయ్యారు. ఇప్పుడు కాస్త విరామం తీసుకుని సేద తీరుతున్నారు.

SS Rajamouli: టూర్‌కి వెళ్లారు.. మొక్కలు నాటారు..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)ఆస్కార్‌ వేదికకు చేరుకోవడం, అక్కడ ప్రమోషన్స్‌, అవార్డు అందుకోవడం ఇలా దాదాపు రెండు మూడు నెలలు తన టీమ్‌తో క్షణం తీరిక లేకుండా గడిపారు రాజమౌళి. హైదరాబాద్‌ వచ్చిన వెంటనే పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. కొద్ది నెక్ట్స్‌ రోజులు తదుపరి చిత్రం ఎస్‌ఎస్‌ఎంబీ29 (SSMB29) స్ర్కిప్ట్‌ పనులో బిజీ అయ్యారు. ఇప్పుడు కాస్త విరామం తీసుకుని సేద తీరుతున్నారు. హాట్‌ హాట్‌ సమ్మర్‌ను కూల్‌గా తమిళనాడులో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆయన ఫ్యామిలీతో కలిసి తమిళనాడులోని తూత్తుకుడి హాలీడేస్‌కు (Rajamouli Family Summer trip) వెళ్లారు.

Untitled-2.jpg

రాజమౌళి ఆయన భార్య రమాతోపాటు కుమారుడు కార్తికేయ ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్లి గడిపారు. ప్రస్తుతం దీనికకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తూత్తుకుడిలోని ఓ రిసార్ట్‌లో రాజమౌళి కుటుంబ సభ్యులు మొక్కలు నాటారు. ఆ వీడియోను రిసార్ట్‌ నిర్వాహకులు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో అవి సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోలను పోస్ట్‌ చేసిన కార్తికేయ ‘త్వరలోనే మరోసారి కచ్చితంగా ఇక్కడకు వస్తాను’ అని ఇన్‌స్టా స్టాటస్‌లో రాశారు. (Thoothukudi Trip)

1.jpg

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. త్వరలోనే మహేశ్‌ బాబుతో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ‘ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు’ అని రాజమౌళి స్వయంగా తెలిపారు. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం ప్రారంభం కానుందని చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు.

2.jpg

Updated Date - 2023-06-27T13:56:44+05:30 IST