Renu Desai - Bahubali: స్టావెంజర్‌ ఓపెరాలో ‘బాహుబలి’.. రేణూ ప్రశంసలు!

ABN , First Publish Date - 2023-08-20T15:04:56+05:30 IST

దర్శకుడు రాజమౌళి (Rajamouli), ‘బాహుబలి’ చిత్రం బృందంపై రేణు దేశాయి (Renu desai) ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాదు ఆయన కోసం ప్రత్యేకంగా సోషల్‌ మీడియాలో ఒక స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆమె నార్వేలో ఉన్నారు.

Renu Desai - Bahubali: స్టావెంజర్‌ ఓపెరాలో ‘బాహుబలి’.. రేణూ ప్రశంసలు!

దర్శకుడు రాజమౌళి (Rajamouli), ‘బాహుబలి’ చిత్రం బృందంపై రేణు దేశాయి (Renu desai) ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాదు ఆయన కోసం ప్రత్యేకంగా సోషల్‌ మీడియాలో ఒక స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆమె నార్వేలో ఉన్నారు. అక్కడ ‘బాహుబలి’(bahubali-1) చిత్రాన్ని వీక్షించారు. నార్వేలో ఈ సమయంలో బాహుబలి చిత్రం చూడటమేంటి అనుకుంటున్నారా. ఈ నెల 18న నార్వేలో స్టావెంజర్‌లోని ఓపెరా హౌస్‌లో ‘బాహుబలి-1’ చిత్రం స్పెషల్‌ స్ర్కీనింగ్‌ జరిగింది. ఈ ప్రదర్శనకు దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమా, నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హాజరయ్యారు. ఇదే షోకు పవన్‌కల్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌కు కూడా హాజరయ్యారు. స్ర్కీనింగ్‌ అనంతరం ఆమె సోషల్‌ మీడియా వేదికగా ‘బాహుబలి’ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

‘‘ఒక ఇండియన్‌ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడం చూస్తుంటే గర్వంగా ఉంది. ప్రేక్షకులుగా మా కోసం మీరు ఇచ్చిన ఈ ఎక్స్‌పీరియన్స్‌ను మాటల్లో చెప్పలేను. స్టావెంజర్‌లో (Stavanger Opera House) ఇలాంటిది ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి నన్ను, అకీరాను అక్కడికి ఆహ్వానించినందుకు శోభు గారికి థ్యాంక్స్‌ అనే మాట చాలా తక్కువ’’ అంటూ పేర్కొన్నారు. సింఫోని ఆర్కెస్ట్రా కాన్సెర్ట్‌ షోతో ప్రదర్శితమైన ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులంతా 10 నిమిషాలపాటు స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారని రేణుదేశాయి తెలిపారు. సంబంధిత వీడియో, ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

దీనికి సంబంధించి రాజమౌళి కూడా ట్వీట్‌ చేశారు. ‘గతంలో ‘బాహుబలి’ చిత్రాన్ని లండన్‌ రాయల్‌ ఆల్బెర్ట్‌ హాల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం ఇప్పటికీ కళ్లల్లో మెదులుతోంది. ఇప్పుడు మళ్లీ అలాంటి అనుభవమే ఎదురైంది. నార్వే స్టావెంజర్‌ ఓపెరా హౌస్‌లో బాహుబలి-1 సింఫోని ఆర్కెస్ట్రా కాన్సర్ట్‌ స్కీనింగ్‌ జరగబోతోంది. ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అని ఇటీవల రాజమౌళి ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-08-20T15:16:38+05:30 IST