Rashmi Goutham: ఓ పాట మొత్తం డాన్స్‌ చేశా.. అదెలా అంటే!

ABN , First Publish Date - 2023-07-18T19:58:20+05:30 IST

‘చిరంజీవితో కలిసి డ్యాన్స్‌ చేయాలంటే భయం వేసింది. కానీ ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించారు. సీన్‌ చేస్తున్నప్పుడు ప్రతి షాట్‌కు ముందు నాతో మాట్లాడేవారు. ఆయనతో కలిసి ఓ పాట మొత్తం డ్యాన్స్‌ చేశాను’’ అని యాంకర్‌ రష్మి గౌతమ్‌ చెప్పారు. టీవీ షోల్లో యాంకర్‌గా రాణిస్తూనే అప్పుడప్పుడూ సినిమాల్లోనూ భాగమవుతోంది. ఇప్పుడీ బ్యూటీ చిరంజీవితో ‘భోళా శంకర్‌’లో స్ర్కీన్‌ షేర్‌ చేసుకొంది.

Rashmi Goutham: ఓ పాట మొత్తం డాన్స్‌ చేశా.. అదెలా అంటే!

'‘చిరంజీవితో (Chiranjeevi) కలిసి డ్యాన్స్‌ చేయాలంటే భయం వేసింది. కానీ ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించారు. సీన్‌ చేస్తున్నప్పుడు ప్రతి షాట్‌కు ముందు నాతో మాట్లాడేవారు. ఆయనతో కలిసి ఓ పాట మొత్తం డ్యాన్స్‌ చేశాను’’ అని యాంకర్‌ రష్మి గౌతమ్‌ (Rashmi Goutham) చెప్పారు. టీవీ షోల్లో యాంకర్‌గా రాణిస్తూనే అప్పుడప్పుడూ సినిమాల్లోనూ భాగమవుతోంది. ఇప్పుడీ బ్యూటీ చిరంజీవితో ‘భోళా శంకర్‌’లో స్ర్కీన్‌ షేర్‌ చేసుకొంది. అయితే ఇంత భారీ చిత్రంలో ఆమె ఎలాంటి పాత్ర చేస్తోంది అన్నది ఇప్పుడు టాపిక్‌గా మారింది. దీనికి సమాధానం ఇటీవల చిరులీక్స్‌ ద్వారా చిరంజీవి విడుదల చేసిన వీడియోలో దొరికేసింది.

ఈ చిత్రంలో చిరంజీవి పవన్‌ కల్యాణ్‌ మేనరిజాన్ని ఇమిటేట్‌ చేసినట్లు చెప్పారు. ‘ఖుషీ’లోని ‘యే మేరా జహా’ పాటకు చిరు స్టెప్స్‌ వేస్తూ ఆ లీక్‌ వీడియోలో చిరంజీవి కనిపించారు. ‘తమ్ముడి పాట మస్తుందిలే’ అని చిరంజీవి అన్న డైలాగ్‌లో రష్మీ చిరు పక్కనే స్టైలిష్‌ దుస్తుల్లో మెరిసింది. దీంతో చిరుతో కలిసి స్టెప్పులేసే అవకాశం రష్మీ అందుకొందని అభిమానులు ఆనందిస్తున్నారు. ప్రస్తుతం అభిమానులు ఆ స్ర్కీన్‌షాట్‌లను నెట్టింట వైరల్‌ చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నాచెల్లెళ్ల అనుబంధం, మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయిక. చిరుకి సోదరిగా కీర్తి సురేశ్‌ నటించారు. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Untitled-3.jpg

చిరంజీవితో కలిసి డాన్స్‌ చేయడం గురించి రష్మి ఏమన్నారంటే.. ‘‘నేను తెలుగులో నేర్చుకున్న మొదటిపాట చిరంజీవి గారిదే. ఆయనతో కలిసి డ్యాన్స్‌ చేయాలంటే చాలా భయమేసింది. కానీ నన్ను ఎంతో ప్రోత్సహించారు. సీన్‌ చేస్తున్నప్పుడు ప్రతి షాట్‌కు ముందు నాతో మాట్లాడేవారు. ‘భోళా శంకర్‌’లో ఆయనతో కలిసి ఓ పాట మొత్తం డ్యాన్స్‌ చేశాను. అంత పెద్ద స్టార్‌ అయినా.. అందరితో కలిసిపోయే వారు. ఒక్కమాటలో చెప్పాలంటే చిరంజీవి అద్భుతమైన వ్యక్తి’’ అని రష్మీ గౌతమ్‌ చెప్పారు.

Updated Date - 2023-07-18T19:58:20+05:30 IST