PuriJagannadh: ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్'

ABN , First Publish Date - 2023-05-14T16:25:46+05:30 IST

దర్శకుడు పూరి జగన్నాధ్, రామ్ పోతినేని మరోసారి కలుస్తున్నారు. ఈసారి వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్బస్టర్ సినిమా 'ఇస్మార్ట్ శంకర్' కి సీక్వెల్ తీస్తున్నారు. రేపు (మే 15) రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త సినిమాని ప్రకటించారు

PuriJagannadh: ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్'
Ram Pothineni

మొత్తానికి చాలా రోజుల తరువాత దర్శకుడు పూరి జగన్నాథ్ (PuriJagannadh) తన రాబోయే చిత్ర టైటిల్ ని, విడుదల తేదీని కూడా ఒకే సారి ప్రకటించేశాడు. రామ్ పోతినేనితో (RamPothineni) 'ఇస్మార్ట్ శంకర్' (iSmartShankar) అనే సినిమా తీసి మంచి విజయాన్ని నమోదు చేసుకొని, మళ్ళీ పరిశ్రమలో నిలబడగలిగేట్టు చేసుకున్న పూరి జగన్నాథ్ దీనికి సీక్వెల్ ప్రకటించాడు. ఆ సీక్వెల్ కి టైటిల్ గా 'డబుల్ ఇస్మార్ట్' (DoubleIsmart) అని పెట్టాడు. ఇది పూరి జగన్నాధ్, ఛార్మి (Charmme) కాంబినేషన్ లోనే ఉంటుంది. వాళ్లిద్దరూ మొదలెట్టిన పూరి కనెక్ట్స్ (PuriConnects) మీద ఈ సినిమాని నిర్మిస్తారు.

rampothineni.jpg

రామ్ పోతినేని #RAPOBirthday పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు. ఇది తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల అవుతుందని చెప్పారు. అలాగే ఇది మార్చ్ 8, 2024 (March 8, 2024) సంవత్సరం లో విడుదల అవుతుందని కూడా ప్రకటించేశారు. పూరి జగన్నాధ్ తొందరగా సినిమాలు తీయటంలో నేర్పరి, అందుకని ఈ సినిమా ఈ సంవత్సరం మొదలుపెట్టి వచ్చే సంవత్సరానికి పూర్తి చేసేట్టుగా పెట్టుకున్నాడు.

purijagannathcharmme.jpg

పూరి జగన్నాథ్, ఛార్మి కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ (VijayDeverakonda), అనన్య పాండే (AnanyaPandey) జంటగా నటించిన 'లైగర్' (Liger) పాన్ ఇండియా సినిమా డిజాస్టర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా వలన చాలా నష్టపోయాం అంటూ కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అంతే కాక, ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ కి కూడా పూర్తి పారితోషికం ఇవ్వలేదని కూడా తెలిసింది. ఇటువంటి నేపధ్యంలో పూరి జగన్నాధ్ కొత్త సినిమా ప్రకటించటం ఆసక్తికరంగా వుంది. అదీ ఒక పాన్ ఇండియా సినిమా.

Updated Date - 2023-05-14T16:25:46+05:30 IST