Mahesh Babu: గుంటూరు కారంకి మరో ఎదురు దెబ్బ, సినిమా నుండి తప్పుకున్న సినిమాటోగ్రఫర్ వినోద్

ABN , First Publish Date - 2023-07-22T13:46:07+05:30 IST

ఏ ముహూర్తాన 'గుంటూరు కారం' మొదలెట్టారో కానీ, ఆది నుండీ అవాంతరాలు ఎదురవుతూనే వున్నాయి. సినిమా ఎప్పుడో షూటింగ్ మొదలవ్వాలి, ఈమధ్యనే మొదలెట్టారు, పూజ హెగ్డే సినిమా నుండి వచ్చేసింది, ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ ఈ సినిమా నుండు తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు

Mahesh Babu: గుంటూరు కారంకి మరో ఎదురు దెబ్బ, సినిమా నుండి తప్పుకున్న సినిమాటోగ్రఫర్ వినోద్
Mahesh Babu from Guntur Karam

మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) దర్శకత్వంలో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaram సినిమాకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అసలే ఈ సినిమా ఇప్పటికే చాలా లేట్ అయింది అని అనుకుంటున్న సమయంలో ఈమధ్యనే షూటింగ్ మొదలెట్టారు. కొన్ని రోజులు షూటింగ్ అయింది, అలాగే మహేష్ బాబు కూడా మళ్ళీ వెకేషన్ కి వెళ్లిపోతున్నారు అని కూడా అంటున్నారు. అతను లేకుండా వున్న సన్నివేశాలు తీయాలని దర్శకుడు త్రివిక్రమ్ ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు ఇంకో ఎదురుదెబ్బ తగిలింది.

maheshbabutrivikramfilm.jpg

ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న పిఎస్ వినోద్ (PSVinod) ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్టుగా చెప్పేసారు. ఎందుకు తప్పుకున్నారు అన్నది ఇంకా విపులంగా తెలియటం లేదు కానీ, అతను చెప్పిన కారణం అయితే మాత్రం క్రియేటివ్ డిఫరెన్సెస్ (CreativeDifferences) అని అంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వినోద్ గత అయిదు సంవత్సరాల నుండి ప్రయాణిస్తున్నారు. ఇంతకు ముందు త్రివిక్రమ్ దర్శకత్వం చేసిన రెండు సినిమాలకు వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేసాడు.

అయితే ఈ 'గుంటూరు కారం' సినిమా గత సంవత్సరం ఎప్పుడూ మొదలెట్టారు. మధ్యలో ఎన్నో అవాంతరాలు వచ్చాయి, ఆగిపోయింది. మళ్ళీ ఈ సంవత్సరం షూటింగ్ మొదలైంది, కానీ ఇందులో కథానాయిక పూజ హెగ్డే (PoojaHegde) బయటకి వచ్చేసింది, ఆమె ప్లేస్ లో శ్రీలీల (Sreeleela) ని తీసుకున్నారు, శ్రీలీల ప్లేస్ లో మీనాక్షి చౌదరి (MeenakshiChaudhary) ని తీసుకున్నారు. సంగీత దర్శకుడు థమన్ (SSThaman) కూడా ఈ సినిమా మీద అంతగా ఆసక్తి చూపించటం లేదని ఒక టాక్ నడుస్తోంది.

ఇప్పుడు వినోద్ ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే షూటింగ్ వెంటనే మళ్ళీ మొదలెట్టాలి అనుకుంటే, సినిమాటోగ్రాఫర్ చాలా ముఖ్యం, వెంటనే ఎవరినైనా తీసుకోవాలి. ఇప్పుడు వినోద్ మానెయ్యటంతో మళ్ళీ మొదటికి వచ్చింది ఈ 'గుంటూరు కారం' కథ అని అంటున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్ టైం మెంట్ సంస్థ నిర్మిస్తోంది, నాగ వంశీ నిర్మాత.

Updated Date - 2023-07-22T13:46:07+05:30 IST