Priyanka chopra: సరోగసీ.. కామెంట్ చేసినంత సులువేం కాదు!
ABN , First Publish Date - 2023-01-21T12:54:01+05:30 IST
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు సరోగసీ ద్వారా బిడ్డను పొందడంపై గర్భాన్ని అద్దెకు తెచ్చుకుందని, రెడీమేడ్ బేబీని కొనుక్కుందని పలు రకాల విమర్శలు చేశారు.
 
                            
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka chopra), నిక్ జోనాస్ దంపతులు సరోగసీ (surrogacy kid) ద్వారా బిడ్డను పొందడంపై గర్భాన్ని అద్దెకు తెచ్చుకుందని, రెడీమేడ్ బేబీని కొనుక్కుందని పలు రకాల విమర్శలు చేశారు. అయితే అప్పట్లో ఈ కామెంట్లపై స్పందించని ప్రియాంక.. ఇప్పుడు నోరు విప్పారు. ‘‘నా కూతురు మాల్తీ పుట్టినప్పుడు నేను ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాను. ఆమె చాలా చిన్నదిగా ఉంది. కొన్ని రోజులు ఇంక్యూబేటర్లో ఉంచారు. ఆ సమయంలో నేనూ, నిక్ చాలా బాధపడ్డాం. కొందరు, డాక్టర్లు నర్సులు దేవుడి ప్రతిరూపాల్లా నిలిచి నా బిడ్డను కాపాడారు. నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే సరోగసీని ఎంచుకున్నాం. అంతేకానీ అందరూ అనుకుంటున్నట్లు అందం తగ్గిపోతుందనే ఇలా చేశానని కామెంట్స్ చేయడం ఎంతో బాధ కలిగించాయి. నా ఆరోగ్య సమస్యల వల్ల సరోగసీని ఎంచుకున్నా. సోషల్ మీడియా ట్రోల్స్ ప్రభావం పడకూడదనే ఇప్పటిదాకా నా బిడ్డ ఫొటో కూడా ఎక్కడా పోస్ట్ చేయలేదు. సరోగసీ ద్వారా బిడ్డను పొందడం కామెంట్ చేసినంత సులువేం కాదు. ఆరు నెలలపాటు వెతికితే ఓ మనసున్న మహిళ ఒప్పుకుంది. అందుకే ఆమె పేరు కూడా కలిేసలా నా కూతురికి మాల్తీ మారీ చోప్రా జోనాస్ అని పేరు పెట్టాం’’ అని చెప్పింది. (proyanka chopra conter to netizens)