Pushpa 2: 'పుష్ప 2' ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సుకి ప్రమాదం, ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2023-05-31T09:57:48+05:30 IST

'పుష్ప 2' యూనిట్ సభ్యులు మారేడుమిల్లి లో షూటింగ్ ముగించుకొని, భద్రాచలం మీదుగా హైదరాబాద్ వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న బస్సు నార్కెట్ పల్లి వద్ద ఆగి వున్న ఆర్టీసీ బస్సును వెనకనుండి ఢీ కొట్టడంతో 'పుష్ప 2' యూనిట్ సభ్యుల్లో కొంతమందికి గాయాలయ్యాయి

Pushpa 2: 'పుష్ప 2' ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సుకి ప్రమాదం, ఇద్దరికి గాయాలు
The bus carrying Pushpa 2 unit members met with an accident

రాజమండ్రి నుండి హైదరాబాద్ 'పుష్ప 2' #Pushpa2 యూనిట్ సభ్యులతో వస్తున్న బస్సు నార్కెట్ పల్లి (Narketpalli) దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ప్రైవేట్ బస్సు వెనకనుండి ఆర్టీసీ బస్సును ఢీకొంది. ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్నవారు మారేడుమిల్లి నుండి హైదరాబాద్ వస్తున్నట్టుగా తెలిసింది. 'పుష్ప 2' #Pushpa2 సినిమా షూటింగ్ మారేడుమిల్లి దగ్గర గత కొన్ని రోజులుగా జరుగుతోంది, నిన్న మంగళవారం షూటింగ్ ముగించుకొని కొంతమంది సాంకేంతిక నిపుణులు, ఇతర సిబ్బంది ఈ బస్సులో వున్నట్టుగా తెలిసింది.

pushpa2accident1.jpg

అల్లు అర్జున్ (AlluArjun) నటిస్తున్న ఈ 'పుష్ప 2' (Pushpa2) సినిమాకి సుకుమార్ (Sukumar) దర్శకుడు. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు జరిగిన షూటింగ్ లో పాల్గొనలేదని కూడా తెలిసింది. మారేడుమిల్లి, భద్రాచలం నుండి హైదరాబాద్ ఆ యూనిట్ సభ్యులు హైదరాబాద్ చేరుకోవాలని ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరికీ స్వల్ప గాయాలు అయినట్టుగా కూడా తెలిసింది. అయితే షూటింగ్ లో ప్లాగొన్న ఆర్టిస్టులు ఎవరూ ఈ బస్సుల్లో లేరని కూడా తెలిసింది.

ఈ షెడ్యూల్ షూటింగ్ లో మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil), బ్రహ్మాజీ (Brahmaji) పాల్గొన్నారని కూడా తెలిసింది. బ్రహ్మాజీ, ఫాజిల్ రాజమండ్రి నుండి విమానంలో హైదరాబాద్ ఈరోజు చేరుకుంటారని, అలాగే దర్శకుడు సుకుమార్ (Sukumar) వ్యక్తిగత పనులు ఉన్నాయని కరీంనగర్ వెళ్లారని కూడా తెలిసింది. బస్సులో కేవలం, ఈ సినిమాకి పనిచేసిన ఎంప్లాయిస్, ఇతర ఎక్స్ట్రా ఆర్టిస్టులు మాత్రమే వున్నారని తెలిసింది. 40 మంది వరకు బస్సులో వున్నట్టుగా తెలిసింది.

Updated Date - 2023-05-31T09:59:22+05:30 IST