Prakash Raj - Siddharth : నాయకులను ప్రశ్నించకుండా.. ఇలా చేయడం కరెక్ట్ కాదు..

ABN , First Publish Date - 2023-09-29T13:56:23+05:30 IST

కర్ణాటక ప్రజల తరపున హీరో సిద్ధార్థ్‌కు (Siddharth) విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్ క్షమాపణలు చెప్పారు. నదీ జలాల విషయంలో వివాదం నెలకొన్న తరుణంలో కొందరు నిరసనకారులు సిద్ధార్థ్‌ నటించిన ‘చిన్న’ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను అడ్డుకున్నారు.

Prakash Raj - Siddharth : నాయకులను ప్రశ్నించకుండా.. ఇలా చేయడం కరెక్ట్ కాదు..

కర్ణాటక ప్రజల తరపున హీరో సిద్ధార్థ్‌కు (Siddharth) విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్ క్షమాపణలు చెప్పారు. నదీ జలాల విషయంలో వివాదం నెలకొన్న తరుణంలో కొందరు నిరసనకారులు సిద్ధార్థ్‌ నటించిన ‘చిన్న’ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీనితో సిద్దార్థ వేదిక నుంచి వెళ్లిపోయారు. దీనిపై ప్రకాశ్‌రాజ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. సదరు వీడియోను షేర్ చేశారు. ‘‘ఎన్నో ఏళ్ళ నాటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన రాజకీయ పార్టీలను, నాయకులను ప్రశ్నించకుండా.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా.. సామాన్యులను, కళాకారులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలా చేయడం సరైన పద్దతి కాదు. ఇది ఆమోదించదగినది కాదు. కర్ణాటకకు చెందిన మనిషిగా నేను ఈ రాష్టం వాళ్లందరి తరపున హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెబుతున్నాను’’ అని ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) ట్వీట్ చేశారు.

రెండు చేతులు జోడించి ఉన్న ఎమోజీలను పోస్ట్ చేసారు. సిద్ధార్థ్‌ అభిమానులు కూడా సోషల్‌ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఇలా జరగడం చాలా బాధగా ఉంది’ అని సోషల్ మీడియాలో కామెంట్స్‌ పెడుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిన్నా చిత్ర, ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది. ఈ సినిమాను కమల హాసన్ సైతం ప్రశంసించారు. ‘‘చిన్నా’ నాకెంతో నచ్చింది. ఈ సినిమాలో మంచి మెసేజ్‌ ఉంది. ఇది కేవలం ఆడపిల్లలు ఉన్న వారికి మాత్రమే కాదు. పిల్లలు ఉన్న వారందరూ చూడాలి. పిల్లలను పిల్లలానే చూడాలి అనే సందేశాన్ని ఇందులో బాగా చూపించారు’ అంటూ సినిమాపై కమల్‌ సినిమా చూసి తన అభిప్రాయాన్ని తెలిపారు.

Updated Date - 2023-09-29T13:56:23+05:30 IST