Prabhas: ప్రభాస్‌-సిద్ధార్థ్‌ ఆనంద్‌తో మైత్రి.. కుదురుతుందా?

ABN , First Publish Date - 2023-02-02T14:41:16+05:30 IST

ఈ మధ్య అంతంత మాత్రంగా ఉన్న బాలీవుడ్‌కు ‘పఠాన్‌’ చిత్రం కాస్త ఊపిరిపోసింది. ఇటీవల కాలంలో విడుదలైన బాలీవుడ్‌ బారీ చిత్రాలన్ని మిశ్రమ స్పందనతో సరిపెట్టుకున్నాయి. ఇప్పుడు షారుక్‌ఖాన్‌ ‘పఠాన్‌’ సక్సెస్‌తో హిందీ చిత్ర పరిశ్రకు కొత్త ఊపు వచ్చింది.

Prabhas: ప్రభాస్‌-సిద్ధార్థ్‌ ఆనంద్‌తో మైత్రి.. కుదురుతుందా?

ఈ మధ్య అంతంత మాత్రంగా ఉన్న బాలీవుడ్‌కు ‘పఠాన్‌’ (pataan)చిత్రం కాస్త ఊపిరిపోసింది. ఇటీవల కాలంలో విడుదలైన బాలీవుడ్‌ బారీ చిత్రాలన్ని మిశ్రమ స్పందనతో సరిపెట్టుకున్నాయి. ఇప్పుడు షారుక్‌ఖాన్‌ ‘పఠాన్‌’ సక్సెస్‌తో హిందీ చిత్ర పరిశ్రకు కొత్త ఊపు వచ్చింది. సిద్దార్థ్‌ ఆనంద్‌ అందించిన ఈ విజయం బాలీవుడ్‌లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌పై (siddartha anand)పడింది. అయితే సిద్ధార్థ్‌ మాత్రం టాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ పిలుపు కోసం వేచి చూస్తున్నాడట. ‘పఠాన్‌’ కంటే ముందు సిద్దార్థ్‌ ఆనంద్‌ ప్రభాస్‌కు మధ్య ఓ సిట్టింగ్‌ జరిగింది. అప్పట్లో వీరిద్దరి ఫొటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. ప్రభాస్‌ కూడా సిద్ధార్థ్‌తో పని చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే ‘పఠాన్‌’ రిజల్ట్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఎదురుచూశాడట. సినిమా సూపర్‌ సక్సెస్‌ కావడంతో ప్రభాస్‌, (prabhas) సిద్ధార్థ్‌ ఆనంద్‌తో పని చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేనట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి కాంబోనే మైత్రీ మూవీ మేకర్స్‌ (mythri movie makers) సంస్థ సెట్‌ చేయబోతుందని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఆల్మోస్ట్‌ ఈ కాంబో వర్కవుట్‌ అవుతుందనే సమాచారం.

(Prabhas - siddarth anand Comobo movie)

ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్‌లో ఒకరైన నవీన్‌ యెర్నేని బుధవారం బాలీవుడ్‌ దర్శకుడు సిద్దార్థ్‌ ఆనంద్‌ని కలిశారు. ‘పఠాన్‌’ అందుకున్న విజయానికి అభినందించారు. ప్రభాస్‌ సినిమా చర్చ కూడా జరిగిందని టాక్‌ వినిపిస్తోంది. అంతా ఓకే అయితే బాలీవుడ్‌లోనే ఈ ప్రాజెక్ట్‌ చేయాలని మైత్రీ సంస్థ యోచిస్తోంది. అలాగే సల్మాన్‌ఖాన్‌తో కూడా ఈ సంస్థ టచ్‌లో ఉంది. సిద్ధార్థ్‌కి చాలా ఆఫర్లు వస్తున్నా... ఆయన దృష్టి మాత్రం ప్రబాస్‌ మీదే ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-02-02T14:41:25+05:30 IST