Prabhas: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్‌

ABN , First Publish Date - 2023-06-06T10:09:33+05:30 IST

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు మంగళవారం వేకువజామున సాంప్రదాయ దుస్తులు ధరించి దేవాలయానికి చేరుకున్నారు. తితిదే (TTD)అధికారులు ప్రభాస్‌కు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు.

Prabhas: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్‌

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు మంగళవారం వేకువజామున సాంప్రదాయ దుస్తులు ధరించి దేవాలయానికి చేరుకున్నారు. తితిదే (TTD)అధికారులు ప్రభాస్‌కు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ఆయన శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులు పొందారు. తదుపరి రంగనాయకుల మండపంలో వేద పండితుల మంగళాశాసనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పట్టు వస్ర్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Untitled-1.jpg

ఆయన హీరోగా నటించిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక మంగళవారం సాయంత్రం తిరుపతిలో జరగనుంది. ప్రభాస్‌ తిరుపతి నగరంలో ఉన్నారని సమాచారం అందుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చినజీయర్‌ స్వామి అతిథిగా హాజరుకానున్నారు. రామాయణం ఇతివృత్తంగా ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్‌ రాఘవుడిగా, కృతీసనన్‌ జానకిగా నటించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. టీ సిరీస్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

6.jpg3.jpg

Updated Date - 2023-06-06T10:09:33+05:30 IST