Bahubali: ప్రభాస్‌.. ఆర్కా నిర్మాతల కలయిక.. అందుకేనా?

ABN , First Publish Date - 2023-04-23T12:47:44+05:30 IST

బాహుబలి’ తెలుగు సినిమా స్థాయిని ప్యాన్‌ ఇండియా స్థాయిలో నిరూపించిన చిత్రం. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటింది.

Bahubali: ప్రభాస్‌.. ఆర్కా నిర్మాతల కలయిక.. అందుకేనా?

‘బాహుబలి’ తెలుగు సినిమా స్థాయిని (Pan india Bahubali) ప్యాన్‌ ఇండియా స్థాయిలో నిరూపించిన చిత్రం. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటింది. ఆ సినిమా సాధించిన విజయ స్ఫూర్తితో ఇప్పుడు దక్షిణాదిన తెరకెక్కే ప్రతీ సినిమా ప్యాన్‌ స్థాయిలోనే రూపొందుతోంది. ఈ చిత్రం ప్రభాస్‌ ({rabhas) కెరీర్‌ మలుపు తిప్పింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా మూడో పార్ట్‌ రానుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ఇదివరకే నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్‌ దేవినేని స్పష్టత ఇచ్చారు. ‘‘బాహుబలి’ పార్ట్‌-3 (bahubali 3) వచ్చే అవకాశం ఉంది. అయితే అది ఎప్పడనేది చెప్పలేం. ప్రస్తుతం రాజమౌళి బిజీగా ఉన్నాడు. తను కమిట్‌ అయిన ప్రాజెక్ట్‌లన్నీ పూర్తయ్యాక దీని గురించి ఆలోచిస్తాం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఎప్పుడో ఒకప్పుడు పార్ట్‌-3 మొదలవుతుంది. అయితే దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఏమీ మొదలుపెట్టలేదు’’ అని గతంలో ఓ ఇంటర్యూలో చెప్పారు. అంటే దీన్ని బట్టి రాజమౌళి దృష్టిలో ‘బాహుబలి-3’ ఉన్నట్లే అని తెలుస్తోంది.

తాజాగా (bahubali producers) మరోసారి ఈ సినిమాకు సంబంధించి చర్చ మొదలైంది. ఇటీవల ప్రభాస్‌ ‘బాహుబలి’ నిర్మాతలను కలవడం వార్తకు మరింత బలం చేకూరింది. ప్రభాస్‌ నిర్మాతల్ని కలిసింది మూడో భాగం కోసమేనా అని చర్చ మొదలైంది. ‘బాహుబలి’ నిర్మాతలు ప్రభాస్‌ కోసం ఓ కథను సిద్ధం చేశారని, అందులో ప్రభాస్‌ ఇప్పటి వరకూ చేయని డిఫరెంట్‌ పాత్ర చేయనున్నాడని టాక్‌ వినిపిస్తోంది. ‘బాహుబలి’ రెండు పార్ట్‌ల కంటే ఈ కథ భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. గత ఇంటర్వ్యూలో ‘బాహుబలి-3’ గురించి ప్రభాస్‌ను అడిగినప్పుడు ‘‘దాని గురించి నా ఇంకా క్లారిటీ లేదు. టైమ్‌ వచ్చినప్పుడు ఏదైనా జరగొచ్చు’’ అని చెప్పారు. ఇప్పుడు ‘బాహుబలి’ నిర్మాతలను కలవడంతో పార్టు -3 గురించి చర్చ మొదలైంది. అయితే ప్రభాస్‌ వీరిని ఎందుకు కలిశారన్నది తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-04-23T12:47:44+05:30 IST