Pooja Hegde : బెదిరింపు కాల్స్‌పై టీమ్‌ క్లారిటీ!

ABN , First Publish Date - 2023-12-14T13:27:46+05:30 IST

పూజా హెగ్డేను(Pooja Hegde) చంపేస్తామంటూ వచ్చిన ఫోన్ కాల్ నిజం కాదని  ఆమె టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. తాజాగా పూజాకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయంటూ బాలీవుడ్‌ మీడియా కోడై కూసింది.

Pooja Hegde : బెదిరింపు కాల్స్‌పై టీమ్‌ క్లారిటీ!

పూజా హెగ్డేను(Pooja Hegde) చంపేస్తామంటూ వచ్చిన ఫోన్ కాల్ నిజం కాదని  ఆమె టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. తాజాగా పూజాకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయంటూ బాలీవుడ్‌ మీడియా కోడై కూసింది. దీనికి కారణం దుబాయ్‌లోని ఓ కార్యక్రమానికి వెళ్లారని.. అక్కడ గొడవ జరగడంతో కొందరు వ్యక్తులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారని బాలీవుడ్‌ మీడియాలో ఓ వార్త వచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్  కంగారుపడి సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. తాజాగా దీనిపై పూజా టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ‘అసలు నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి తప్పుడు వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారో అర్థం కాదు. ఇందులో ఎలాంటి నిజం లేదు. దయచేసి ఇలాంటి అవాస్తవాలను నమ్మకండి’’ అని ఓ ప్రకటనలో పూజా హెగ్డే పీఆర్‌ టీమ్‌ తెలిపింది. దాంతో ఆమె. దీంతో పూజా అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. (Threatening calls to Pooja hegde)

పూజాహెగ్డే తాజాగా ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ సినిమాలో కనిపించారు. త్రివిక్రమ్‌-మహేశ్‌ల కాంబోలో వస్తోన్న ‘గుంటూరు కారం’లో మొదట ఆమెనే హీరోయినగా ఎంపిక చేశారు. పలు కారణాల వల్ల ఆమె ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం షాహిద్‌ కపూర్‌ హీరోగా మలయాళ దర్శకుడు రోషన్‌ ఆండ్రూస్‌ తెరకెక్కిస్తున్న ఓ బాలీవుడ్‌ చిత్రంలో పూజా నటిస్తున్నారు.

Updated Date - 2023-12-14T13:38:30+05:30 IST