Ntr-Allu Arjun: ఇద్దరూ కలిసి ఏం చేశారంటే!

ABN , First Publish Date - 2023-04-27T12:12:00+05:30 IST

టాలీవుడ్‌ హీరోలు ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో బిజీగా ఉన్నారు. పోరాట సన్నివేశాలతో బిజీగా ఉన్నారు.

Ntr-Allu Arjun: ఇద్దరూ కలిసి ఏం చేశారంటే!

టాలీవుడ్‌ హీరోలు ఎన్టీఆర్‌(Ntr), అల్లు అర్జున్‌ (Allu arjun) రామోజీ ఫిల్మ్‌ సిటీలో బిజీగా ఉన్నారు. పోరాట సన్నివేశాలతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్‌30(Ntr30), అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ‘పుష్ప-2’ ({ush[a2)చిత్రాల షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో జరుగుతోంది. ఈ రెండు సినిమాల సెట్లు పక్కపక్కనే అని తెలిసింది. అలాగే బన్నీ, తారక్‌ ఉండేది కూడా ఒకటే హోటల్‌లో. షూటింగ్‌ పూర్తయిన తర్వాత వీరిద్దరూ సరదాగా కలిశారని తెలిసింది. సాయంత్రం షూటింగ్‌ ప్యాకప్‌ చెప్పాక.. తారక్‌ తన బావగా భావించే అల్లు అర్జున్‌ని కలిశారట. ఇద్దరూ ఒకే హోటల్‌ ఉండడం వల్ల తారక్‌ సరదాగా బన్నీని, దర్శకుడు సుకుమార్‌ను కలిశారట. రెండు చిత్రాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో కూడా వైరల్‌ అవుతుంది. (Ntr meets allu arjun at RFC)

అల్లు అర్జున్‌, జూనియన్‌ ఎన్టీఆర్‌ మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరే ఒకరికొకరు బావా అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. బన్నీ పుట్టినరోజున తారక్‌ బావా అంటూ సంభోదిస్తూ శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆయన ట్వీట్‌ ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే! ఇద్దరు స్టార్‌ హీరోలు సరదాగా కలిసి మాట్లాడుకోవడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ 30 చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. ఇక అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ‘పుష్ప-2’ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ సాధించిన ‘పుష్ప’ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Updated Date - 2023-04-27T12:25:53+05:30 IST