Nithya Menen : అంతకు మించి ఆలోచించేవాళ్లు దొరికితే.. అప్పుడు చూస్తా!

ABN , First Publish Date - 2023-10-29T15:27:42+05:30 IST

అలా మొదలైంది’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది నిత్య మీనన్. కెరీర్‌ బిగినింగ్‌ నుంచే ఆమెకు డబ్బింగ్‌ చెప్పుకోవడం అలవాటు. అలాగే పాటలు పాడే ప్రతిభ ఆమెలో ఉంది. దక్షిణాది చిత్రాలతోపాటు ఉత్తరాదిలో మిషన్  మంగల్‌ లాంటి సినిమాలో భాగమై నటిగా నిరూపించుకుంది.

Nithya Menen : అంతకు మించి ఆలోచించేవాళ్లు దొరికితే.. అప్పుడు చూస్తా!

‘అలా మొదలైంది’ (Ala modalaindi) చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది నిత్య మీనన్. కెరీర్‌ బిగినింగ్‌ నుంచే ఆమెకు డబ్బింగ్‌ చెప్పుకోవడం అలవాటు. అలాగే పాటలు పాడే ప్రతిభ ఆమెలో ఉంది. దక్షిణాది చిత్రాలతోపాటు ఉత్తరాదిలో మిషన్  మంగల్‌ లాంటి సినిమాలో భాగమై నటిగా నిరూపించుకుంది. ప్రస్తుతం సినిమాల్లోనే కాదు.. సిరీస్‌, టీవీ షో ల్లోనూ తన ప్రత్యేకతను చాటుతోంది. ‘బ్రీత్‌: ఇన్‌ టు ద షాడోస్‌’, ‘మోడర్న్‌ లవ్‌ హైదరాబాద్‌’ వెబ్‌ సిరీస్‌లతో అంతర్జాతీయంగా వెబ్‌ వీక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో ఇండియన ఐడల్‌ షోకి హోస్ట్‌గానూ వ్యవహరించింది. అంతే కాదు ‘స్కైలాబ్‌’ అనే చిత్రంతో నిర్మాతగా మారింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో ‘కుమారి శ్రీమతి’ సిరీస్‌తో అలరిస్తోంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన మలయాళ వెబ్‌ సిరీస్‌ ‘మాస్టర్‌ పీస్‌’ కూడా స్ట్రీమింగ్ కి  రెడీగా ఉంది.

తాజాగా నిత్య మీనన్ పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. "నేను పక్కా ట్రెడిషనల్‌ అమ్మాయిని. మన సంస్కృతిని చాలా గౌరవిస్తా. పెళ్లి విషయంలో నాకు స్థిరమైన అభిప్రాయం ఉంది. పెళ్లి.. అనేది సోషల్‌, ఫైనాన్షియల్‌ సెక్యూరిటీతో ముడిపడి ఉన్న విషయం. నాకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. ఎవరైనా దానికి మించి ఆలోచించేవాళ్లు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా’’ అని చెప్పారు.

Updated Date - 2023-10-29T15:27:42+05:30 IST