Netizens Fire on Rashmi: మరో వివాదంలో రష్మీ.. మండిపడుతున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2023-06-30T13:23:59+05:30 IST

టీవీ యాంకర్‌, నటి రష్మీ గౌతమ్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. ఆమె జంతు ప్రేమికురాలు. లాక్‌డౌన్‌ సమయంలో తను ఉండే ఏరియాలో ఉండే శునకాలకు ప్రతి రోజూ ఆహారం పెట్టేది. మూగ జీవాలను హింసించడాన్ని ఆమె అసలు సహించదు. ఇలాంటి విషయాలు ఆమె దృష్టికి వచ్చిన ప్రతిసాకీ ఆమె సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉంటుంది.

Netizens Fire on Rashmi: మరో వివాదంలో రష్మీ.. మండిపడుతున్న నెటిజన్లు

టీవీ యాంకర్‌, నటి రష్మీ (Rashmi Goutham) గౌతమ్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. ఆమె జంతు ప్రేమికురాలు. లాక్‌డౌన్‌ సమయంలో తను ఉండే ఏరియాలో ఉండే శునకాలకు ప్రతి రోజూ ఆహారం పెట్టేది. మూగ జీవాలను హింసించడాన్ని ఆమె అసలు సహించదు. ఇలాంటి విషయాలు ఆమె దృష్టికి వచ్చిన ప్రతిసాకీ ఆమె సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉంటుంది. జంతుప్రేమికురాలిగా ఆమె చేేస ట్వీట్లు, పోస్ట్‌లు మిస్‌ ఫైర్‌ అయ్యి వివాదాలకు దారి తీసిన సందర్భాలెన్నో ఉన్నాయి. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్‌తో మరో వివాదంలో చిక్కుకుంది రష్మి. జంతువులను హింసించి, బలి ఇచ్చే ఆచారాలపై మండిపడుతూ తరచూ పోస్ట్‌లు చేసే ఆమె తాజాగా ‘బక్రీద్‌’ పండుగ సందర్బంగా ఓ పోస్ట్‌ చేసింది రష్మీ. అందరిని తిడుతూ చేసిన పోస్ట్‌తో నెటిజన్ల ఆగ్రహానికి, విమర్శలకు గురవుతోంది.

అమెరికాలో జంతు బలికి సంబంధించిన ఫొటోలను ఓ నెటిజన్‌ షేర్‌ చేయగా ఆ ట్వీట్‌కు రష్మీ కామెంట్‌ చేసింది. ముస్లింలు, జంతు బలికి సంబంధించిన ఆ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇదే ఇప్పుడు రష్మీ గౌతమ్‌ ను విమర్శలకు గురి చేస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా విమర్శిస్తున్నారు. ‘పండగల సమయంలోనే జంతువుల మీద నీకు అంత ప్రేమ’ అంటూ ఓ నెటిజన్‌ రాసుకొచ్చాడు. ‘పెద్ద పెద్ద కంపెనీలు నాన్‌ వెజ్‌లో వెరైటీలను చేస్తున్నారు. వాటికి స్టార్స్‌తో పబ్లిసిటీ చేయిస్తున్నారు.. వాళ్లను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావ్‌’ అని కామెంట్‌ చేశాడు.

Updated Date - 2023-06-30T13:23:59+05:30 IST