Shaakuntalam: నిర్మాతలకు నష్టం ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు

ABN , First Publish Date - 2023-04-20T10:47:43+05:30 IST

దిల్ రాజు, గుణశేఖర్ లు సంయుక్తంగా నిర్మించిన 'శాకుంతలం' సినిమా టోటల్ డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో నిర్మాతలకు ఎంత నష్టమో తెలిస్తే మాత్రం షాక్. దిల్ రాజు ఎంత పెట్టాడు, గుణశేఖర్ ఎంత పెట్టాడు అన్న దానిపై ఒక్కొక్కలకి ఎంత నష్టం అనేది తెలుస్తుంది.

Shaakuntalam: నిర్మాతలకు నష్టం ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు

గత వారం విడుదల అయిన 'శాకుంతలం' (Shaakuntalam) మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) ఈ సినిమా గురించి ఎంత గొప్పగా చెప్పినా, ఇందులో శకుంతల గా నటించిన సమంత (Samantha) ఎంత కష్టాల్లో వుండి ఈ సినిమా చేసిందో చెప్పినా, ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని అస్సలు పట్టించుకోలేదు. నిర్మాత దిల్ రాజు (Dil Raju) తనే ఈ సినిమాకి అల్లు అర్జున్ (Allu Arjun) లాంటివాడని, తనని చూసి ప్రేక్షకులు సినిమాకి వస్తారని అనుకున్నాడు, కానీ పాపం ప్రేక్షకులు అతని సినిమాకి రాలేదు, అలాగే అతనికి ఈ సినిమా ద్వారా నష్టం వచ్చేటట్టు చేశారు.

Dil-Raju.jpg

ఇంతకీ ఈ సినిమా వలన నష్టం ఎంత ఉండొచ్చు అని ట్రేడ్ అనలిస్ట్స్ అనుకుంటే చాలానే అంటున్నారు. అయితే దిల్ రాజు కి ఈ ప్రాజెక్ట్ లోకి రావటం సుతారమూ ఇష్టం లేదని పరిశ్రమలో ఇప్పుడు ఒక టాక్ నడుస్తోంది. ఎందుకంటే అతనికి తెలుసు ఇటువంటి సినిమాలు నడవవు అని, కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ ప్రాజెక్ట్ లోకి రావలసి వచ్చిందని తెలుస్తోంది. ఇందులోకి అడుగు పెట్టాక తనవంతు కృషి తాను చెయ్యాలి కాబట్టి ప్రచారాలు అవి కొంచెం తన భుజం పైన వేసుకొని చేసాడు అని అంటున్నారు.

ఈ సినిమాకి సుమారు 70 కోట్ల వరకు బడ్జెట్ అయిందని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి '3డి' ని కూడా చివర్లో చేర్చారు. ఆ సాంకేతిక పరిజ్ఞానం తెలియకపోయినా, అరకొర నాలెడ్జి తో దాన్ని ఈ సినిమాకి పెట్టారు, దాని మీద సుమారు పది కోట్లకు పైగా ఖర్చు అయిందని అంటున్నారు, అందువలనే ఈ సినిమా బడ్జెట్ 70 కోట్ల వరకు వెళ్ళింది అని కూడా పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

shakuntalam-15.jpg

ఈ సినిమా ఓటిటి హక్కులు 35 కోట్లాది అమ్మారని తెలిసింది. ఇంకా సాటిలైట్ హక్కులు ఇవ్వలేదని కూడా అంటున్నారు. ఈమధ్య కాలంలో ఏ సినిమాకి రానటువంటి వరస్ట్ టాక్ ఈ సినిమాకి వచ్చింది కాబట్టి ఈ సినిమాని ఇప్పుడు సాటిలైట్ హక్కులు అతి తక్కువకి పోతాయి అని కూడా అంటున్నారు. అయితే ఎలా వేసుకున్నా కూడా సుమారు రూ. 30 కోట్ల పైనే నిర్మాతలు నష్టం వచ్చిందని అంటున్నారు. అయితే ఈ సినిమాకి దిల్ రాజు ఎంత పెట్టాడు, గుణశేఖర్ ఎంత పెట్టాడు అన్న దాని మీద ఈ రూ.30 కోట్ల నష్టం లో ఎవరికీ ఎంత నష్టం అనేది తేలుతుంది. కానీ మొత్తం మీద అయితే మాత్రం ఈ సినిమా పెద్ద లాస్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకి థియేటర్ రెవిన్యూ కూడా పెద్దగా రాలేదు.

Updated Date - 2023-04-20T10:59:11+05:30 IST