Nani 31 : 'అంటే సుందరానికి' తర్వాత మళ్లీ కాంబో కుదిరింది..!

ABN , First Publish Date - 2023-10-21T16:02:21+05:30 IST

నేచురల్‌ స్టార్‌ నాని(Nani) వరుస చిత్రాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన 'హాయ్‌ నాన్న’ చిత్రంతో బిజీగా ఉన్నారు. శనివారం ఆయన అప్ కమింగ్  సినిమాకు  సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు.

Nani 31 : 'అంటే సుందరానికి' తర్వాత మళ్లీ కాంబో కుదిరింది..!

నేచురల్‌ స్టార్‌ నాని(Nani) వరుస చిత్రాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన 'హాయ్‌ నాన్న’ చిత్రంతో బిజీగా ఉన్నారు. శనివారం ఆయన అప్ కమింగ్  సినిమాకు  సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు. ‘అంటే సుందరానికి’ తర్వాత వివేక్‌ ఆత్రేయతో (Vivek Athreya) కలిసి నాని (Nani 31)ఓ చిత్రం చేయబోతున్నారు. డి.వి.వి ఎంటర్‌టైనమెంట్స్‌ (DVV Entertainments) ఈ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. వివేక్‌ ఆత్రేయ సినిమా టైటిళ్లు ఆసక్తికరంగా ఉంటాయి. ‘మెంటల్‌ మదిలో’, ‘అంటే సుందరానికి’ అంటూ టైటిల్‌తోనే ఆయన ఆసక్తి కలిగించారు. ఇప్పుడు మరో ఆసక్తికర టైటిల్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'సరిపోదా శనివారం’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ను ఎంపిక చేశారు. దసరా రోజు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్‌ ఈ నెల 24 నుంచి మొదలుకానుంది.

తాజాగా నాని ‘హాయ్‌ నాన్న’లో నటిస్తున్నారు. శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-10-21T16:05:50+05:30 IST