సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Namrata shirodkar: వెలితిగానే ఉంది!

ABN, First Publish Date - 2023-01-21T14:53:45+05:30

మహేశ్‌ భార్య నమ్రతా శిరోద్కర్‌ తన కుమారుడిన ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. కల్చరల్‌ టూర్‌లో భాగంగా గౌతమ్‌ తొలిసారి సొంతంగా ప్రయాణం చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేశ్‌ భార్య నమ్రతా శిరోద్కర్‌ (Namratha sirodhkar) తన కుమారుడిన ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. కల్చరల్‌ టూర్‌లో భాగంగా గౌతమ్‌ తొలిసారి సొంతంగా ప్రయాణం చేశాడు. అలా ఒంటరిగా తనను పంపడం తనకెంతో బాధగా ఉందని చెప్పారు. కుమారుడు తిరిగి వచ్చే వరకూ వెలితిగానే ఉంటుందని (goutham cultural trip) ఆమె పేర్కొన్నారు. ‘‘కల్చరల్‌ ట్రిప్‌(cultural trip)లో భాగంగా గౌతమ్‌ మొదటిసారి సొంతంగా విదేశాలకు వెళ్లాడు. నాలోని ఓ భాగం నన్ను వదిలి వెళ్లినట్లు అనిపించింది. తను ఇంట్లో లేనన్ని రోజులు నాకు శూన్యంగా గడిచింది. తను ఇంటికి తిరిగి వచ్చి.. మా కళ్ల ముందు ఉండే వరకూ ఈ బాధ పోదు. ఇంటిని వదిలి మా బాబు ఎగరగలుగుతున్నాడు. ఈ వారం మొత్తం సరదాలు, సంతోషాలు, సాహసాలతో గడవాలని ముఖ్యంగా ఈ ప్రయాణంలో నిన్ను నువ్వు మరింత తెలుసుకోవాలని ఆశిస్తున్నా. ఈ ట్రిప్‌ నీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అలాగే నీ రాక కోసం ఎదురుచూస్తుంటా’’ అని నమ్రత పేర్కొన్నారు.

Updated Date - 2023-01-21T15:09:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!