Namrata shirodkar: వెలితిగానే ఉంది!

ABN , First Publish Date - 2023-01-21T14:53:45+05:30 IST

మహేశ్‌ భార్య నమ్రతా శిరోద్కర్‌ తన కుమారుడిన ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. కల్చరల్‌ టూర్‌లో భాగంగా గౌతమ్‌ తొలిసారి సొంతంగా ప్రయాణం చేశాడు.

Namrata shirodkar: వెలితిగానే ఉంది!

మహేశ్‌ భార్య నమ్రతా శిరోద్కర్‌ (Namratha sirodhkar) తన కుమారుడిన ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. కల్చరల్‌ టూర్‌లో భాగంగా గౌతమ్‌ తొలిసారి సొంతంగా ప్రయాణం చేశాడు. అలా ఒంటరిగా తనను పంపడం తనకెంతో బాధగా ఉందని చెప్పారు. కుమారుడు తిరిగి వచ్చే వరకూ వెలితిగానే ఉంటుందని (goutham cultural trip) ఆమె పేర్కొన్నారు. ‘‘కల్చరల్‌ ట్రిప్‌(cultural trip)లో భాగంగా గౌతమ్‌ మొదటిసారి సొంతంగా విదేశాలకు వెళ్లాడు. నాలోని ఓ భాగం నన్ను వదిలి వెళ్లినట్లు అనిపించింది. తను ఇంట్లో లేనన్ని రోజులు నాకు శూన్యంగా గడిచింది. తను ఇంటికి తిరిగి వచ్చి.. మా కళ్ల ముందు ఉండే వరకూ ఈ బాధ పోదు. ఇంటిని వదిలి మా బాబు ఎగరగలుగుతున్నాడు. ఈ వారం మొత్తం సరదాలు, సంతోషాలు, సాహసాలతో గడవాలని ముఖ్యంగా ఈ ప్రయాణంలో నిన్ను నువ్వు మరింత తెలుసుకోవాలని ఆశిస్తున్నా. ఈ ట్రిప్‌ నీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అలాగే నీ రాక కోసం ఎదురుచూస్తుంటా’’ అని నమ్రత పేర్కొన్నారు.

Updated Date - 2023-01-21T15:09:10+05:30 IST