Naga Vamsi : టైమ్‌ సరిపోతుంది.. ఆ టెన్షన్ ఏమీలేదు!

ABN , First Publish Date - 2023-11-20T21:30:07+05:30 IST

మహేశ్‌ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం’ చిత్రానికి సంబంధించి నిర్మాత నాగవంశీ బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన 'ఆదికేశవ’ చిత్రం ట్రైలర్‌ విడుదల వేదికపై 'గుంటూరు కారం' చిత్రం గురించి నిర్మాత నాగవంశీపై ప్రశ్నల వర్షం కురిపించారు

Naga Vamsi : టైమ్‌ సరిపోతుంది.. ఆ  టెన్షన్ ఏమీలేదు!

మహేశ్‌ బాబు (Mahesh Babu) హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం’ (Guntur kaaram) చిత్రానికి సంబంధించి నిర్మాత నాగవంశీ బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన 'ఆదికేశవ’ చిత్రం ట్రైలర్‌ విడుదల వేదికపై 'గుంటూరు కారం' చిత్రం గురించి నిర్మాత నాగవంశీపై ప్రశ్నల వర్షం కురిపించారు అభిమానులు. ‘'గుంటూరు కారం’ సినిమా విడుదలకు సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికి ఒక్క పాటే విడుదల చేశారు. మిగిలిన పాటలు విడుదల చేయడానికి సమయం సరిపోతుందా?" అని అభిమానులు నాగవంశీని అడగగా ''ఇంకా మూడు పాటలు విడుదలకు ఉన్నాయి. అవి అందరికీ చేరువ కావడానికి సరిపడ సమయం ఉంది. ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది. వచ్చే ఏడాదంతా పాడుకునేలా ఉంటాయి. వచ్చేవారం రెండో పాటను విడుదల చేస్తాం’’ అని చెప్పారు.

ఆదికేశవ చిత్రాన్ని వైష్ణవ్‌తేజ్‌తోనే చేయాలనుకున్నారా? మరో హీరోని సంప్రదించారా? అన్న ప్రశ్నకు "కథ విన్నప్పుడే వైష్ణవ్‌తేజ్‌ అయితే బాగుంటుందని అనుకున్నా. ఫస్ట్‌ చాయిస్‌ ఆయనే. ఈ చిత్రంలో విజువల్స్‌, పాటలు, నేపథ్య సంగీతంతోపాటు కామెడీ, యాక్షన్‌ సీక్వెన్స్‌ అదనంగా అలరిస్తాయి. సంక్రాంతికి విడుదలైన ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మళ్లీ అలాంటి పూర్తిస్థాయి మాస్‌ చిత్రాలు రాలేదు. భగవంత్‌ కేసరి’ వచ్చినా అందులో మరో జానర్‌ను టచ్‌ చేశారు. ‘ఆదికేశవ’ పూర్తిస్థాయి మాస్‌ సినిమా. థియేటర్‌ దద్దరిల్లిపోతుంది’’ అని తెలిపారు.

వైష్ణవ్‌తేజ్‌ శ్రీలీల జంటగా శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 24న సినిమాని ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Updated Date - 2023-11-20T21:30:08+05:30 IST