Prabhas : అభ్యంతరాల మేరకే.. ఆ నిర్ణయం!

ABN , First Publish Date - 2023-09-28T13:00:32+05:30 IST

ఇటీవల మైసూర్‌లోని ఓ మ్యూజియంలో ప్రభాస్‌ (Prabhas) మైనపు విగ్రహం (Wax statue) ఏర్పాటు చేసిన విషయంలో నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మండిపడ్డ విషయం తెలిసిందే!

Prabhas : అభ్యంతరాల మేరకే.. ఆ నిర్ణయం!

ఇటీవల మైసూర్‌లోని ఓ మ్యూజియంలో ప్రభాస్‌ (Prabhas) మైనపు విగ్రహం (Wax statue) ఏర్పాటు చేసిన విషయంలో నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మండిపడ్డ విషయం తెలిసిందే! ‘బాహుబలి’లోని అమరేంద్ర బాహుబలి పాత్రకు సంబంధించిన ఈ మైనపు విగ్రహంపై శోభు (Shobhu yarlagadda) ట్వీట్‌ చేశారు. తమ దృష్టికి తీసుకురాకుండా ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఏర్పాటు చేశారని, దానిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. అంతే కాదు ఆ విగ్రహం అసలు ప్రభాస్‌ను పోలి లేదని అభిమానులు మండిపడిన సంగతి తెలిసిందే! నెట్టింట ఈ విషయం విపరీతంగా ట్రోల్‌ అవుతోంది. దీనిపై సదరు మ్యూజియమ్‌ నిర్వాహకులు స్పందించారు.

‘‘ఎవరి మనోభావాలు దెబ్బ తీయాలని ఆ విగ్రహం పెట్టలేదు. మ్యూజియంలోని ప్రభాస్‌ విగ్రహంపై చిత్ర నిర్మాత నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే దీన్ని తొలగించాలని నిర్ణయించుకున్నాం’’ అని తెలిపారు. దీంతో నెట్టింట వస్తున్న ట్రోల్స్‌కు బ్రేక్‌ పడింది. ‘బాహుబలి’లో ప్రభాస్‌ నటనకుగానూ ఆయన మైనపు విగ్రహాన్ని అధికారికంగా మేడం టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘సలార్‌’ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. , ‘కల్కి 2898 ఏడీ’, ‘స్పిరిట్‌’లతో పాటు మారుతితో ఓ మూవీ చేస్తున్నారు.

Updated Date - 2023-09-28T13:00:49+05:30 IST