Mohan Babu: మరో సంచలన నిర్ణయం... ఈసారి 100 కోట్లు

ABN , First Publish Date - 2023-06-01T15:15:11+05:30 IST

సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తిరుమల శ్రీవారిని ఈరోజు దర్శించుకున్నారు. ఆ తరువాత బయటకి వచ్చి మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఒక సంచలన ప్రకటన చేశారు.

Mohan Babu: మరో సంచలన నిర్ణయం... ఈసారి 100 కోట్లు
Mohan Babu

మంచు కుటుంబంలో #ManchuFamily ఎవరు ఏమి మాట్లాడినా అది వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు (MohanBabu) ఒక సంచలన ప్రకటన చేశారు. ఈరోజు తిరుపతిలో (Tirupati) శ్రీవారిని దర్శించుకొని బయటకి వచ్చిన తరువాత మీడియా వాళ్ళతో మాట్లాడేరు. మోహన్ బాబు కు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు అయిన రజనీకాంత్ (Rajinikanth) గురించి ఈమధ్య సాంఘీక మాధ్యమంలో చాలామంది చాలా నెగటివ్ కామెంట్స్ పెట్టారు, దాని మీద మోహన్ బాబుని మీరు ఎందుకు సైలెంట్ గా ఉండిపోయారు అని అడిగితే ఆ విషయం తరువాత మాట్లాడుదాం అని చెప్పి దాటవేశారు.

mohanbabu1.jpg

టిటిడీ TTD ఈఓ ధర్మారెడ్డి (DharmaReddy) ని ఆరు నెలల తరువాత కలిసాను అని, అతనికి జరిగిన నష్టం చాలా ఘోరం అయినదని, ఆ నష్టం పూడ్చలేనిది చెప్పారు మోహన్ బాబు. ధర్మారెడ్డి కుమారుడు కొన్ని నెలల క్రితం గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. అలాగే దర్శనం చాలా బ్రహ్మాండంగా అయిందని, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి (YVSubbaReddy) ని కూడా కలిసాను అని, ఇద్దరూ చాలా చక్కగా చేస్తూ భక్తులకు దర్శనాలు చాలా చక్కగా చేయిస్తున్నారు అని చెప్పారు మోహన్ బాబు. అలాగే తన విశ్వవిద్యాలయం గురించి చెప్పారు.

ఇక సినిమా విషయానికి వస్తే 100 కోట్లు పెట్టి ఒక భారీ బడ్జెట్ చిత్రం ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు మోహన్ బాబు. ఈ చిత్ర విశేషాలు విష్ణు (ManchuVishnu) చెపుతాడు అని చెప్పారు. మోహన్ బాబు ఆమధ్య విడుదల అయిన 'శాకుంతలం' పౌరాణిక సినిమాలో దుర్వాసో మహర్షి పాత్ర వేశారు. గుణశేఖర్ (Gunasekhar) దీనికి దర్శకుడు, సమంత (Samantha), దేవ్ మోహన్ (DevMohan) లు లీడ్ పెయిర్ గా వేశారు. సినిమా సరిగ్గా ఆడకపోయినా, మోహన్ బాబు కి చాలా మంచి పేరు వచ్చింది.

Updated Date - 2023-06-01T15:15:11+05:30 IST