Chiranjeevi: షాక్‌ ఇచ్చావయ్యా... వేణు!

ABN , First Publish Date - 2023-03-11T13:42:51+05:30 IST

‘బలగం’ (Balagam) చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) చిత్ర బృందాన్ని అభినందించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రం ఉందని ఆయన అన్నారు. ‘

Chiranjeevi: షాక్‌ ఇచ్చావయ్యా... వేణు!

‘బలగం’ (Balagam) చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) చిత్ర బృందాన్ని అభినందించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రం ఉందని ఆయన అన్నారు. ‘భోళా శంకర్‌’ (Bhola shankar) చిత్రం షూటింగ్‌లో ఉన్న ఆయన ‘బలగం’ చిత్ర దర్శకనిర్మాతలు దిల్‌ రాజు9Dil raju), వేణు, నటుడు ప్రియదర్శిలను సన్మానించారు. కమెడీయన్‌గా కెరీర్‌ ప్రారంభించిన వేణు ‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ప్రియదర్శి(Priyadarshi), కావ్య కల్యాణ్‌రామ్‌ నటీనటులుగా దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్‌హిట్‌గా నిలిచింది. శనివారం ‘బలగం’ చిత్రం చిరంజీవిని కలిశారు. ‘‘తెలంగాణ సంస్కతిని ప్రతిబింబించేలా చిత్రం ఉందని, నిజాయతీగా చేసిన ప్రయత్నమిదని చిరంజీవి టీమ్‌ని అభినందించారు. ‘దిల్‌ రాజు లాంటి కమర్షియల్‌ ప్రొడ్యూసర్‌ ఉన్నప్పటికీ ఆ హంగులు అద్దకుండా నిజాయతీగా కథను చెప్పి వేణు తానెంటో నిరూపించుకున్నాడు. తాను చిన్నప్పటి నుంచి చూసిన ప్రతి విషయాన్ని సినిమాలో చూపించాడు. వేణు పలు వేదికలపై చెప్పిన ఒగ్గు కథలు చూసి అతని మీద గౌరవం పెరిగింది. నిజంగా ఇంతమంచి సినిమా తీసి షాక్‌ ఇచ్చావయ్యా వేణు.. ఇలా షాక్‌ ఇస్తే ఎలా?’ అని సరదాగా సంభాషించారు చిరంజీవి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. దీనికి దర్శకుడు వేణు ట్వీట్‌ చేశారు. ‘‘ఇంతకుమించి ఇంకేం కావాలి. 20 ఏళ్ల సినీ జీవితంలో మరచిపోలేని రోజును చిరంజీవిగారు ఇచ్చారు. ఈ క్షణాల్ని జీవితాంతం మరచిపోలేను. థ్యాంక్యూ సో మచ్‌ సర్‌. ఇది నా బలగం విజయం. ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అని అన్నారు.(Chiranjeevi Appreciated Balagam Team )


Updated Date - 2023-03-11T14:35:59+05:30 IST