Mangalavaaram : మంగళవారం.. మంగళవారం ఈ కొత్త భాగోతం ఏందిరా!

ABN , First Publish Date - 2023-10-21T14:10:26+05:30 IST

పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal rajputh) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'మంగళవారం’. (Mangalavaaram) క్రైమ్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం అజయ్‌ భూపతి (ajay Bhupati) దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళం. కన్నడ, హిందీ భాషల్లో నవంబర్‌ 17న ఈ సినిమా విడుదల కానుంది

Mangalavaaram : మంగళవారం.. మంగళవారం ఈ కొత్త భాగోతం ఏందిరా!

పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal rajputh) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'మంగళవారం’. (Mangalavaaram) క్రైమ్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం అజయ్‌ భూపతి (ajay Bhupati) దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళం. కన్నడ, హిందీ భాషల్లో నవంబర్‌ 17న ఈ సినిమా విడుదల కానుంది. ‘మంగళవారం’ సినిమా ట్రైలర్‌ను శనివారం మెగాస్టార్ చిరంజీవి  విడుదల చేశారు. ట్రైలర్‌ చూస్తే గ్రామీణ నేపథ్యంలో వరుస హత్యల ఇతివృత్తంతో సాగే కథలాగా ఉంది. ప్రతి మంగళవారం ఆ గ్రామంలో జరిగే మరణాలకు కారణం ఏంటి? అన్నది సస్పెన్స్ గా  చూపించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించిన మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.



‘‘మంగళవారం’ సినిమా నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ నాకు సన్నిహితులు. స్వాతిరెడ్డి ఎంతో డైనమిక్‌ అమ్మాయి. మా అమ్మాయి శ్రీజకి మంచి   స్నేహితురాలు. నాకు యువత, అందులోనూ యంగ్‌ విమెన్‌ సినిమా  ఇండస్ట్రీలో  వివిధ శాఖల్లోకి ఎంటర్‌ అవుతుంటే చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. వాళ్ల ఆలోచనలు కొత్తగా న్యూ ఎనర్జీతో ఉంటాయి. ఫిలిం మేకింగ్‌, మార్కెటింగ్‌లకి ఒక కొత్త డైరెక్షన్‌ని ఇవ్వగలరు. స్వాతిరెడ్డి లాంటి యంగ్‌స్టర్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేసి అజయ్‌ భూపతిలాంటి ఓ టాలెంటెడ్‌ డైరెక్టర్‌తో కలిసి తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేయటం ఎంతో సంతోషం. విలేజ్‌ నేపథ్యంలో రస్టిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను నా చేతులమీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ సాధించాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.  

Updated Date - 2023-10-21T14:16:33+05:30 IST