Manchu Vishnu: 600 మందితో న్యూజిలాండ్ లో 'కన్నప్ప' షూటింగ్ స్టార్ట్!

ABN , First Publish Date - 2023-09-25T15:53:33+05:30 IST

మంచు విష్ణు డ్రీము ప్రాజెక్ట్ 'కన్నప్ప' షూటింగ్ న్యూజిలాండ్ లో మొదలైంది. ఈ సినిమా కోసం సుమారు 600 మంది పనిచేస్తున్నారని విష్ణు తన సాంఘీక మాధ్యమం ద్వారా తేలియాచేసారు. అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం సహాయ సహకారాలు అందించిన రచయితలకి, దర్శకులకి కృతజ్ఞతలు చెప్పారు.

Manchu Vishnu: 600 మందితో న్యూజిలాండ్ లో 'కన్నప్ప' షూటింగ్ స్టార్ట్!
Manchu Vishnu

విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు (ManchuMohanBabu) పెద్ద కుమారుడు విష్ణు మంచు (VishnuManchu) ఇప్పుడు 'కన్నప్ప' #Kannappa అనే ఒక భక్తిరస సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా శ్రీకాళహస్తి (SriKalahasti) లో అధికారికంగా లాంచ్ చేశారు. ఇప్పుడు మంచు విష్ణు తన సాంఘీక మాధ్యమం అయిన ట్విట్టర్ లో ఈ సినిమా గురించి ఒక సుదీర్ఘ లేఖను పోస్ట్ చేశారు. ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని, దీనికి గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడుతూ వస్తున్నాం అని, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో మొదలయిందని రాసారు.

ఏడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నామని, ఎందరినో సంప్రదించామన్నారు, ఇప్పటికి తన కల నెరవేరి షూటింగ్ మొదలెడుతున్నామని అంతా ఆ ఈశ్వరుడు, పార్వతి దేవి కృప అని చెప్పాడు విష్ణు మంచు ఆ పోస్టులో. ఈ సందర్భంగా విష్ణు ఈ ప్రాజెక్ట్ లో తనకి సహాయ సహకారాలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసాడు.

kannappa1.jpg

మొదటిసారిగా రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి (ThanikellaBharani) ఈ 'కన్నప్ప' #Kannappa కథని తన దగ్గరకి తీసుకు వచ్చారని, అయితే తాను ఆ కథని ఇంకా పెద్దగా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో కొంతమందిని సంప్రదించి కథకి మెరుగులు దిద్దారని చెప్పాడు. అందులో రచయితలు పరుచూరి గోపాలకృష్ణ (ParuchuriGopalakrishna), విజయేంద్ర ప్రసాద్ (VijayendraPrasad), తోటపల్లి సాయినాథ్ (ThotapalliSainath), తోట ప్రసాద్, దర్శకులు నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి (EswarReddy) వీళ్ళందరూ తనకి సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. అలాగే తన తండ్రి మొదటి నుండీ ఎంతో సపోర్ట్ గా వుండి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో చేసారని చెప్పుకొచ్చాడు విష్ణు.

సుమారు 600 మంది ఈ సినిమాకోసం కళాకారులు, సాంకేంతిక నిపుణులు పని చేస్తున్నారని, వాళ్ళందరూ ఈ సినిమా మీద నమ్మకంతో తమ కుటుంబాలకి వదిలి న్యూజీలాండ్ షూటింగ్ కి వచ్చారని చెప్పాడు విష్ణు. అలాగే ఈ సినిమా గురించి ఎటువంటి అధికారిక సమాచారం అయినా, తన ట్విట్టర్ ద్వారా తెలియపరుస్తాను అని చెప్పాడు విష్ణు. ఈ సినిమాకి ముకేశ్ కుమార్ సింగ్ (MukeshKumarSingh) దర్శకుడు కాగా, ఇందులో ప్రభాస్ (Prabhas), నయనతార (Nayanthara) కూడా నటిస్తున్నట్టుగా తెలిసింది. అలాగే 'రోజా' ఫేమ్ మధుబాల (Madhubala) కూడా వున్నట్టుగా తెలిసింది.

Updated Date - 2023-09-25T15:53:33+05:30 IST