Malli Pelli Trailer: వర్షం.. నువ్వు చెప్పి రారుగా!

ABN , First Publish Date - 2023-05-11T15:12:06+05:30 IST

నరేశ్‌ - పవిత్రా లోకేశ్‌.. ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో బాగా ట్రెండింగ్‌లో ఉన్న జంట. వీరిద్దరూ కలిసి భార్యభర్తలుగా నటించారు. తాజాగా ఎమ్మెస్‌ రాజు దర్శకత్వంలో ‘మళ్లీ పెళ్లి’. చిత్రంలో జంటగా నటిస్తున్నారు.

Malli Pelli Trailer: వర్షం.. నువ్వు చెప్పి రారుగా!

నరేశ్‌ (Naresh)- పవిత్రా లోకేశ్‌.. (Pavithra lokesh)ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో బాగా ట్రెండింగ్‌లో ఉన్న జంట. వీరిద్దరూ కలిసి భార్యభర్తలుగా నటించారు. తాజాగా ఎమ్మెస్‌ రాజు దర్శకత్వంలో ‘మళ్లీ పెళ్లి’. (Malli pelli) చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. గురువారం ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ విడుదల చేశారు. నరేశ్‌ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించినట్లు తెలుస్తోంది. ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నరేంద్రగా నరేశ్‌, పార్వతిగా పవిత్రా లోకేశ్‌ నటించారు. వనితా విజయ్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఇందులో డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.

‘‘అయినా పెళ్లైన ఆవిడతో మీకు లవ్‌ ఏంటి సర్‌... మీది పడిపడక లేచే వయసు. ఎప్పుడు లేస్తుందో.. ఎప్పుడు పడుతుందో.. (Malli pelli Trailer)

వెయ్యి కోట్ల ఫిగర్‌ సర్‌ మీరు... హాయ్‌ చెప్పక బాయ్‌ చెబుతుందా?

ఏంటీ సడెన్‌గా వర్షం...

వర్షం.. నువ్వు చెప్పి రారుగా

‘‘మీడియా ముందు.. తనతో రిలేషన్‌షిప్‌ ఉందని ఒప్పుకొంటే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న.. అంటే ఆమెను ఉంచుకున్నారా సర్‌ అని.. మొగుడును ఉంచుకొని అతడితో రంకు చేస్తున్నావా అని ఆమెను అడుగుతారు’’ అని ఘాటైన డైలాగ్స్‌తో మరింత ఆసక్తిని పెంచారు. నరేష్‌, పవిత్రను కలిసిన దగ్గరనుంచి పెళ్లి వరకు అన్ని విషయాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. నరేష్‌ జీవితంలోకి పవిత్ర రావడం, ఆమెతో పరిచయం, ప్రేమగా మారడం, అది నచ్చని మూడో భార్య నరేష్‌తో గొడవ, పవిత్రను.. కృష్ణకు పరిచయం చేయడం, మీడియా ముందు కనిపించడం, ఇలా ఒకటి కాదు.. నరేశ్‌-పవిత్రల జీవితాల్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్‌ను ట్రైలర్‌లో చూపించారు. సంభాషణలు, లొకేషన్‌లు లొకేషన్స్‌ కూడా నిజ జీవితానికి దగ్గరగా ఉన్నాయి. ఇందులో కృష్ణ, మహేష్‌ను కూడా నరేష్‌ వదలలేదు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

Updated Date - 2023-05-11T15:12:06+05:30 IST