Mahesh Babu : తండ్రి విగ్రహావిష్కరణ.. మహేష్‌ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-11-10T15:51:35+05:30 IST

దివంగత సూపర్‌స్టార్‌ కృష్ణ (Superstar Krishna) విగ్రహాన్ని విశ్వనటుడు కమల్‌ హాసన్‌ (Kamal haasan) ఆవిష్కరించారు. ఈ మేరకు సూపర్‌స్టార్‌ మహేష్‌ ట్వీట్‌ చేశారు. "విజయవాడలో నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్‌ హాసన్‌గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను'అన్నారు

Mahesh Babu : తండ్రి విగ్రహావిష్కరణ.. మహేష్‌ ఏమన్నారంటే..

దివంగత సూపర్‌స్టార్‌ కృష్ణ (Superstar Krishna) విగ్రహాన్ని విశ్వనటుడు కమల్‌ హాసన్‌ (Kamal haasan) ఆవిష్కరించారు. 'భారతీయుడు -2' (Indian 2)చిత్రం షూటింగ్‌ కోసం వచ్చిన ఆయన విజయవాడ గురునానక్‌ కాలనీలో ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని (krishna Statue) అభిమానుల సమక్షంలో ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ తనకు ఎంతో ఆనందం కలిగించిందని కమల్‌ హాసన్‌ చెప్పారు. ఈ మేరకు సూపర్‌స్టార్‌ మహేష్‌ ట్వీట్‌ చేశారు. "విజయవాడలో నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్‌ హాసన్‌గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా గర్వకారణం. ఆయన వదిలి వెళ్లిన జ్ఞాపకాలు, వారసత్వానికి ఇదొక నివాళి. ఈ కార్యక్రమంలో కమల్‌ హాసన్‌ గారు భాగమైనందుకు గర్వంగా ఉంది. నాన్న విగ్రహం ఏర్పాటు చేయడానికి కారణమైన అందరికీ, ఈ ఈవెంట్‌గా గ్రాండ్‌గా నిర్వహించిన అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. మహేష్ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

ప్రస్తుతం మహేష్‌బాబు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో 'గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి 'ధమ్‌ మసాలా’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. తదుపరి మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే!

Updated Date - 2023-11-10T15:52:50+05:30 IST